దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ‘బాహుబలి’ సినిమా తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచ వ్యాప్తంగా తెలియజేసింది.తెలుగు సినిమా స్థాయిని పది రెట్టు పెంచిన ‘బాహుబలి’ సినిమాతో రాజమౌళి ఉన్నత శిఖరాలకు చేరాడు.
ప్రస్తుతం రాజమౌళి ‘బాహుబలి’ రెండవ పార్ట్ చిత్రీకరణలో బిజీగా ఉన్నాడు.ఇటీవలే రెండవ పార్ట్ చిత్రీకరణ ప్రారంభం అయ్యింది.
వచ్చే సంవత్సరం చివర్లో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు రావడమే లక్ష్యంగా జక్కన్న అండ్ టీం పని చేస్తున్నారు.‘బాహుబలి’ తర్వాత రాజమౌళి చేయబోతున్న సినిమాలపై పలు రకాల వార్తలు షికారు చేస్తూనే ఉన్నాయి.
కొన్నాళ్ల క్రితం రాజమౌళి ‘గరుడ’ సినిమాను తెరకెక్కిస్తాడు అంటూ ప్రచారం జరిగింది.
ఆ వార్తలు నిజమే అన్నట్లుగా కొన్ని ప్రకటనలు కూడా వచ్చాయి.
కాని మంచు విష్ణు ఆ టైటిల్ను రిజిస్ట్రర్ చేయించడంతో రాజమౌళి ‘గరుడ’ లేనట్లే అని అంతా నిటూర్చారు.కాని తాజాగా ఒక కార్యక్రమంలో జక్కన్న పాల్గొన్న సందర్బంగా ‘గరుడ’పై సంచలన ప్రకటన చేశాడు.
‘గరుడ’ సినిమా చేస్తాను అని, అయితే అది ఎప్పుడు, ఏంటి అనేది తనకే తెలియదు అని అన్నాడు.‘గరుడ’కు సంబంధించి ఒక్క కథ ఉంది అని, దాన్ని ఎలా మొదలు పెట్టాలి, ఎప్పుడు మొదలు పెట్టాలి అనే విషయంలో తాను ఇంకా ఏం ఆలోచించలేదు అంటూ పేర్కొన్నాడు.
దాంతో ‘బాహుబలి’ తర్వాత జక్కన్న ‘గరుడ’ను తెరకెక్కించడం కన్ఫర్మ్ అంటూ ప్రచారం మొదలైంది.అత్యంత భారీ బడ్జెట్తో ‘గరుడ’ తెరకెక్కబోతున్నట్లుగా సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.