సినిమా టికెట్ల రేట్లను తగ్గించాలని ఫిలిం ఛాంబర్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు నిర్మాత దిల్ రాజు తెలిపారు.చిత్ర పరిశ్రమలో సమస్యలపై ఫిల్మ్ ఛాంబర్ లో నాలుగు కమిటీలు వేసి చర్చలు జరిపారు.
ఈ క్రమంలో తీసుకున్న కొత్త నిర్ణయాలను ఆయన వెల్లడించారు.ఎనిమిది వారాల తర్వాతే సినిమాను ఓటీటీలో రిలీజ్ చేయాలని నిర్ణయించుకున్నామన్నారు.
సినీ ప్రియులకు అందుబాటులో ఉండే విధంగా టికెట్ రేట్లను తగ్గించాలని డిసైడ్ అయినట్లు చెప్పారు.అయితే షూటింగ్స్ ఎప్పుడు ప్రారంభం కావాలనేది నిర్ణయం తీసుకోలేదన్నారు.
మరో మూడు, నాలుగు రోజుల్లో ఫైనల్ మీటింగ్స్ ఉన్నాయన్న దిల్ రాజు.అన్ని వివరాలు వెల్లడిస్తామని స్పష్టం చేశారు.