అక్కినేని నాగచైతన్యనకు ఎట్టకేలకు ‘మజిలీ’ చిత్రంతో మంచి విజయం దక్కింది.భార్య సమంతతో కలిసి నటించిన ఈ చిత్రం మంచి విజయాన్ని దక్కించుకున్న నేపథ్యంలో నాగచైతన్య చాలా హ్యాపీగా ఉన్నాడు.
నాగార్జున సోలోగా నటించిన చిత్రాల్లో ఇదే అత్యధిక వసూళ్లను నమోదు చేసింది.ఇప్పటికే ఈ చిత్రం 35 కోట్లను వసూళ్లు చేయగా, లాంగ్ రన్ లో 40 కోట్ల వరకు సాధిస్తుందనే నమ్మకం వ్యక్తం అవుతోంది.
ఇక ఈ చిత్రంతో నాగచైతన్య తన పారితోషికంను పెంచినట్లుగా తెలుస్తోంది.
మజిలీకి ముందే వెంకీమామ చిత్రంకు కమిట్ అయ్యాడు కనుక ఆ సినిమా పారితోషికం విషయంలో మార్పు లేదు.
అది కాకుండా ఆ సినిమాకు మామయ్య సురేష్బాబు నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు.అందుకే నాగచైతన్య పారితోషికం విషయంలో పట్టింపు లేదు.అయితే తదుపరి చిత్రంను దిల్రాజు బ్యానర్ లో చేసేందుకు చర్చలు జరుగుతున్నాయి.మూడు సంవత్సరాలుగా ఒకే పారితోషికంను తీసుకుంటున్న నాగచైతన్య ఈసారి తన పారితోషింను కోటిన్నర వరకు పెంచినట్లుగా తెలుస్తోంది.అయిదు కోట్ల పారితోషికం తీసుకుంటున్న చైతూ 6.5 కోట్ల పారితోషికంను డిమాండ్ చేస్తున్నాడు.
దిల్రాజు బ్యానర్లోనే కాకుండా ‘ఆర్ఎక్స్ 100’ చిత్రంతో మంచి విజయాన్ని దక్కించుకున్న దర్శకుడు అజయ్ భూపతి దర్శకత్వంలో కూడా ఒక సినిమాను తీసేందుకు నాగచైతన్య ఓకే చెప్పాడు.ఆ సినిమాకు కూడా ఆరు కోట్లకు పైగా పారితోషికంను డిమాండ్ చేస్తున్నాడు.
నాగచైతన్య ఈ రెండు సినిమాలు కూడా సక్సెస్ అయితే మరింతగా పారితోషికం పెంచడం ఖాయం.ఇలాగే ఒక మూడు నాలుగు సక్సెస్లు పడితే మనోడి పారితోషికం పది కోట్లకు పడుతుందేమో చూడాలి.