టాలీవుడ్ లో టాప్ స్టార్ హీరోయిన్ గా దూసుకు పోతున్న ముద్దుగుమ్మ పూజా హెగ్డే.ఈమె తెలుగు లో నటించిన రాధే శ్యామ్ మరియు మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ సినిమా లు విడుదలకు సిద్దం గా ఉన్నాయి.
ఈ రెండు సినిమా లు మాత్రమే కాకుండా మరో రెండు సినిమా లు కూడా తెలుగు లో ఈమె చేస్తున్న విషయం తెల్సిందే.ఇక ఈమె తమిళంలో మొదటి సినిమా కు ఓకే చెప్పింది.
అది కూడా తమిళ సూపర్ స్టార్ విజయ్ తో అవ్వడం వల్ల ఆమె ఆ సినిమా కోసం ఎన్నో రోజులుగా ఎదురు చూస్తోంది.కరోనా సెకండ్ వేవ్ కారణంగా గత మూడు నెలలుగా పూర్తిగా ఇంటికే పరిమితం అయిన ఈ పొడుగు కాళ్ల సుందరి ఎట్టకేలకు ముంబయి నుండి చెన్నై లో ల్యాండ్ అయ్యింది.
ఒకటి రెండు రోజుల్లో విజయ్ తో షూటింగ్ లో జాయిన్ అవ్వబోతుంది.
విజయ్ మరియు పూజా హెగ్డేల కాంబోలో రాబోతున్న సినిమా ను ఇదే ఏడాది లో విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారు.
మూడు నెలల తర్వాత షూటింగ్ కు వెళ్లబోతున్నట్లుగా ఆమె చెబుతోంది.పూజా హెగ్డే బాలీవుడ్ లో కూడా ఈమె సినిమా లు చేస్తోంది.
ముఖ్యంగా ఈమె సల్మాన్ ఖాన్ కు జోడీగా నటించబోతున్న నేపథ్యంలో అంచనాలు భారీగా ఉన్నాయి.బాలీవుడ్ లో ఈమె ఇప్పటికే నటించింది.
కాని ఆ సినిమా నిరాశ పర్చింది.
ఇప్పుడు తన అభిమాన నటుడు సల్మాన్ ఖాన్ తో నటించబోతున్నందుకు చాలా సంతోషంగా ఉందంటూ ఆమె ఇటీవల చెప్పుకొచ్చింది.ఒక వైపు తెలుగు లో ప్రభాస్ తో.తమిళంలో విజయ్ తో మరో వైపు హిందీ లో సల్మాన్ ఖాన్ తో నటిస్తున్న సినిమా లు ఇదే ఏడాది లో ప్రేక్షకుల ముందుకు వస్తాయి.దాంతో ఈ అమ్మడు ఆన్ ఇండియా స్టార్ హీరోయిన్ గా మారడం ఖాయం అంటున్నారు.