ఆఫ్గనిస్థాన్ దేశంలో పరిస్థితులు మారుతున్నాయి.అమెరికా బలగాల ఉపసంహరణ తర్వాత.
మళ్లీ తాలిబాన్ల ప్రభావం పెరుగుతోంది.ఈ క్రమంలో దేశంలో చాలా ప్రాంతాలను తాలిబన్లు స్వాధీనపర్చుకున్నారు.
ఈ పరిణామంతో భారత్ అప్రమత్తమైంది.ఈ నేపథ్యంలో అక్కడ దౌత్య కార్యాలయంలో భారత అధికారులను వెనక్కి వచ్చేయాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది.
పరిస్థితి ఇలా ఉండగా దేశంలో అంతర్గత ఘర్షణలకు తాలిబన్లు పాల్పడుతూ రెచ్చిపోతూ ఉండటంతో చైనా ఆందోళన వ్యక్తం చేయడం జరిగింది.
అంతేకాకుండా తమ దేశానికి చెందిన 210 చైనీయులను గతవారం చైనా వెనక్కి తీసుకెళ్లింది.పరిస్థితి ఇలా ఉండగా ఆఫ్ఘనిస్తాన్ పునర్నిర్మాణంలో చైనా పాత్ర కూడా ఉండాలి అంటూ తాలిబన్ అధికార ప్రతినిధి సుహైల్ షహీన్ తెలిపారు.అంతేకాకుండా చైనా తమకి మిత్ర దేశంగా భావిస్తున్నట్లు కూడా.
స్పష్టం చేశారు. ప్రస్తుతం దేశంలో అంతర్గత గొడవలు జరుగుతూ ఉండటంతో దేశ రాజధాని కాందహార్ను సొంతం చేసుకునే దిశగా అడుగులు వేస్తూ ఉండటంతో.
ఇండియా అప్రమత్తమై దౌత్య కార్యాలయంలో ఇంకా అదే రీతిలో ఐటిబిపి సిబ్బందిని వెనక్కి వచ్చేయాలని ఆదేశాలు జారీ చేసింది.