కాబుల్: ఆఫ్ఘనిస్తాన్ను తాలిబన్లు ఆక్రమించిన అనంతరం ఆ దేశంలోని లక్షలాది మంది ప్రజలు దేశం విడిచి, ఇతర దేశాలకే చేరుకుని, అక్కడ ఆశ్రయం పొందుతున్నారు.అయితే ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్లో తాలిబన్ల అరాచకాలకు మించిన మరో సమస్య వేధిస్తోంది.
అదే ఆకలి.ఆఫ్ఘనిస్తాన్లో ఐదేళ్ల కన్నా తక్కువ వయసు గల పిల్లల్లో సగం మంది తీవ్రమైన పోషకాహార లోపంతో బాధపడుతున్నారని ఐక్యారాజ్య సమితి ఒక నివేదికలో పేర్కొంది.
ఆ దేశ పౌరుల్లో మూడింట ఒక వంతు మందికి తగినంత ఆహారం అందడం లేదని నివేదిక పేర్కొంది.ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆ దేశం మరింత పెద్ద సంక్షోభంలోకి వెళ్లకుండా ఉండాలంటే ఆ దేశానికి అవసరమైన సేవలను అందించాలని ఐక్యరాజ్య సమితి సూచించింది.
ఆఫ్ఘనిస్తాన్కు ఆరోగ్య, రక్షణ సేవలతో పాటు ఆహారం, ఇతర ఆహారేతర అవసరాలను తీర్చాలని కోరింది.
ప్రస్తుతం కాబూల్ విమానాశ్రయంలో 800 మంది పిల్లలతో సహా ప్రజలకు రక్షణ, ఆహార సేవలను వివిధ సంస్థలు అందిస్తున్నాయి.అయితే వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ కింద అందిస్తున్న ఆహార నిల్వలు సెప్టెంబర్ చివరి నాటికి అయిపోవచ్చని ఐక్యరాజ్య సమితి తెలిపింది.అలాగే ఔషధాల నిల్వలు కూడా అడుగంటిపోతున్నాయి.
ప్రస్తుత పరిణామాలకు ముందే ఆఫ్ఘనిస్తాన్లోని సగం జనాభా ప్రాథమిక అవసరాలకు కూడా నోచుకోని స్థితిలో ఉంది.