అక్కినేని నాగ చైతన్య సాయి పల్లవి జంటగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో లవ్ స్టోరీ సినిమా తెరకెక్కిన విషయం తెలిసిందే.ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో పూర్తి చేసుకున్న ఇంకా విడుదలకు నోచుకోలేదు.
అయితే ఇటీవలే ఈ సినిమాను సెప్టెంబర్ 24 న విడుదల చేస్తామని చిత్ర యూనిట్ ప్రకతింహ్చింది.ఇక ఇప్పుడు రిలీజ్ డేట్ దగ్గర పడడంతో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ స్టార్ట్ చేసింది.
ఇప్పటికే విడుదలైన అన్ని పోస్టర్స్, టీజర్, పాటలు ఈ సినిమాపై ఆసక్తిని పెంచాయి.ఇక ఈ మధ్యనే రిలీజ్ అయినా ట్రైలర్ సినిమాపై మరిన్ని అంచనాలు పెంచేసింది.ఈ ట్రైలర్ లో శేఖర్ కమ్ముల మార్క్ కనిపించింది.ఇక ఈ సినిమా పక్కా హిట్ అని అందరు అనుకుంటున్నారు.ఇక ఈ సినిమాలో నాగ చైతన్య, సాయి పల్లవి పెయిర్ ను తెర మీద చూడడం కోసం అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు.
ఇక ఈ సినిమా రిలీజ్ కు వారం రోజులే ఉండడంతో అప్పుడే అడ్వాన్స్ బుకింగ్స్ స్టార్ట్ అయినట్టు తెలుస్తుంది.
కరోనా తర్వాత ఏ సినిమాకు కూడా అడ్వాన్స్ బుకింగ్స్ జరగలేదు.అయితే లవ్ స్టోరీ సినిమాపై భారీ అంచనాలు ఉన్న నేపథ్యంలో ఈ సినిమాకు మాత్రం ముందుగానే టికెట్స్ బుకింగ్ అవుతున్నాయట.
హైదరాబాద్ లో ఉన్న థియేటర్స్ లో ఫస్ట్ డే 245 షోలలో 85 షోలు హౌస్ ఫుల్ అయిపోయాయి.
ఇక మహేష్ ఏఎంబి సినిమాస్ లో కూడా ఇప్పటికే 6000 టికెట్స్ అమ్ముడయ్యాయని టాక్.ఇప్పటికే దాదాపు 35 శాతం ఆక్యుపెన్సీ తో థియేటర్స్ ఫుల్ అయ్యాయి.చాలా రోజుల తర్వాత థియేటర్ లు కళకళ లాడబోతున్నాయి.
ఇక అడ్వాన్స్ బుకింగ్స్ జరగడం వల్ల ఈ సినిమాకు భారీ ఓపెనింగ్స్ రావడం ఖాయం.ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ రేపు జరగనుంది.
తాజా వార్తలు