పట్టపగలు నలుగురు సిగ్గుపడే వీడియో ఒకటి జనం సంచరించే బస్టాండ్లో ప్రదర్శించడంతో అక్కడి జనం సిగ్గుతో తలదించుకున్న సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.భోపాల్ రాష్ట్రంలోని విద్యానగర్ అనే ప్రాంతంలోని బస్టాండ్లో ఉన్న టికెట్ వెండింగ్ మిషన్ స్క్రీన్పై ఒక్కసారిగా శృంగార వీడియో ఒకటి ప్రత్యక్షమయ్యింది.
అది చూసిన జనం ఒక్కసారిగా అవాక్కయ్యారు.బస్టాండ్లో ఇలాంటి వీడియోలు ఏమిటి అంటూ ముక్కున వేలేసుకున్నారు.కాగా అదే విషయాన్ని అధికారులకు ఫిర్యాదు చేశారు.ఈ తతంగాన్ని మొత్తం అక్కడ ఉన్న ఓ వ్యక్తి సెల్ఫోన్లో రికార్డు చేసి సోషల్ మీడియాలో వదిలాడు.
అది కాస్త వైరల్ కావడంతో సంబంధిత అధికారులు సాంకేతిక లోపం వల్ల అలా జరిగిందంటూ చెప్పుకొచ్చారు.
ఇక సోషల్ మీడియాలో ఆ వీడియో చూసిన జనం బస్టాండ్లో ప్రజలను ఇబ్బంది పెట్టే ఇలాంటి వీడియోలు ఎలా వేశారంటూ ప్రశ్నలు గుప్పించారు.
ఏదేమైనా వెండింగ్ మిషన్లో అలాంటి వీడియోను ఎవరు పెట్టారో తేల్చాలంటూ అధికారులు పోలీసులను కోరారు.