కరోనా లాక్ డౌన్ తో సినిమా ఇండస్ట్రీ మొత్తం ఓ విధంగా నిర్బంధ బంద్ లోకి వెళ్ళిపోయింది.షూటింగ్ లు అన్ని ఆగిపోయాయి.
ఆరు నెలల పాటు సినిమా షూటింగ్ కానీ, సినిమా రిలీజ్ గాని లేకుండా పోయాయి.మరల లాక్ డౌన్ తర్వాత కేంద్ర ప్రభుత్వం షూటింగ్ లకి పర్మిషన్ ఇవ్వడంతో ఒకరి తర్వాత ఒకరు షూటింగ్ లు స్టార్ట్ చేస్తున్నారు.
ఇప్పటికే చాలా సినిమాలు లొకేషన్ లోకి వచ్చి షూటింగ్ చేసుకుంటున్నాయి.ఆర్ఆర్ఆర్ లాంటి పాన్ ఇండియా సినిమా షూటింగ్ కూడా ప్రారంభం అయిపొయింది.
ఇదిలా ఉంటే సూపర్ స్టార్ మహేష్ బాబు నిర్మాతగా అడవి శేష్ టైటిల్ రోల్ లో తెరకెక్కుతున్న మేజర్ సినిమా షూటింగ్ కూడా మళ్ళీ స్టార్ట్ అయ్యింది.మెజారిటీ షూటింగ్ ఇప్పటికే కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అయ్యినట్లు ఇందులో కీలక పాత్రలో కనిపిస్తున్న హీరోయిన్ శోభిత దూళిపాళ్ల ట్విట్టర్ ద్వారా క్లారిటీ ఇచ్చింది. గూఢచారి తర్వాత అడవి శేష్ కాంబినేషన్ లో శోభిత చేస్తున్న రెండో తెలుగు సినిమా ఇదే కావడం విశేషం.మేజర్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో అతని కీలక పాత్రలో శోభిత కనిపిస్తుంది.
ముంబై టెర్రర్ ఎటాక్స్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా కథ ఉండబోతుంది.ఇదిలా ఉంటే శోభిత ఈ సినిమా షూటింగ్ కి సంబంధించి కొన్ని ఫోటోలు ట్విట్టర్ లో షేర్ చేసింది.
నా తొలి తెలుగు సినిమా గూఢాచారికి పని చేసిన అదే టీంతో మళ్లీ.మేం సంతోషంగా మేజర్ ప్రాజెక్టు కోసం చెమట చిందించి, కన్నీళ్లు ఒడుస్తున్నాం.ఇది ఒక అనాటమీ స్టోరీ లాంటిది అంటూ శోభిత పోస్ట్ పెట్టింది.ఈ సినిమాని తెలుగు, హిందీ బాషలలో ఏకకాలంలో తెరకెక్కిస్తున్నారు.