ఎప్పటి నుండో ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్న పాన్ ఇండియా సినిమాల్లో మేజర్ ఒకటి.ఈ సినిమాను మహేష్ బాబు తన సొంత నిర్మాణ సంస్థ అయినా జిఎంబి ఎంటర్టైన్మెంట్స్ తో కలిపి నిర్మించాడు.
మహేష్ బాబు ఈ సినిమాలో భాగం కావడంతో ముందు నుండి మహేష్ అభిమానులు సైతం ఈ సినిమాపై ద్రుష్టి పెట్టారు.అయితే ఈ సినిమా ఎప్పుడో షూటింగ్ పూర్తి చేసుకున్నా కరోనా కారణంగా ఈ సినిమా వాయిదా పడుతూ వస్తుంది.
ఈ సినిమాలో టాలీవుడ్ టాలెంటెడ్ హీరో అడవి శేష్ హీరోగా నటించాడు.రియల్ ఇండియన్ ఆర్మీ హీరో సందీప్ ఉన్ని కృష్ణన్ జీవితం లో జరిగిన సంఘటనల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కిస్తున్నారు.
వాస్తవ సంఘటనలకు కమర్షియల్ ఎలిమెంట్స్ జోడించి పాన్ ఇండియా సినిమాగా దీనిని తెరకెక్కించారు. శశి కిరణ్ తిక్క దర్వకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది.
ఈ సినిమా ఎట్టకేలకు విడుదల అయ్యేందుకు రెడీ అయ్యింది.ఈ నెల 27న మేజర్ సినిమా రిలీజ్ కాబోతుంది.
దీంతో మేకర్స్ ఇప్పటి నుండే ప్రొమోషన్స్ స్టార్ట్ చేసారు.ఈ క్రమంలోనే అడవి శేష్ వరుసగా ఇంటర్వ్యూలలో పాల్గొంటున్నాడు.
అయితే ఈ ఇంటర్వ్యూలో భాగంగా ఈయన తన పెళ్లి గురించి అడిగితే ఆసక్తికర సమాధానం చెప్పాడు.
ఈయనను పెళ్లి గురించి అడిగితే ప్రభాస్, అనుష్క లకు ఇంకా పెళ్లి కాలేదు కదా అని సమాధానం తెలిపాడు.ఇండస్ట్రీలలో చాలా మందికి పెళ్లి కాలేదు కదా.వారి పెళ్లిళ్లు అయినా తర్వాత చూద్దాం.నా ఫ్రెండ్ అనుష్క ఉంది.రానాకు పెళ్లి అయినా ప్రభాస్ కు ఇంకా అవ్వలేదు.వాళ్ళవి అయినా తర్వాత చూద్దాం.అప్పుడు నేను పెళ్లి చేసుకుంటా అంటూ చెప్పుకొచ్చాడు.
ఇలా అడవి శేష్ తన పెళ్లి గురించి ప్రశ్న ఎదురైతే మ్యాటర్ ను సైడ్ చేసి మధ్యలో అనుష్క, ప్రభాస్ లను తీసుకు వచ్చాడు.