కరోనా సెకండ్ వేవ్, లాక్ డౌన్ కారణంగా ఇప్పటికే చాలా సినిమాలు రిలీజ్ వాయిదా పడ్డాయి.ఏప్రిల్ నుంచి జూన్ వరకు రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేసుకొని రెడీగా ఉన్న సినిమాలు అన్ని కూడా ఒక్కొక్కటిగా వాయిదా పడుతున్నాయి.
కరోనా పరిస్థితులు చూస్తూ ఉంటే ఇప్పట్లో థియేటర్స్ ఓపెన్ చేసే పరిస్థితి కనిపించడం లేదు.ఈ నేపధ్యంలో ఒటీటీకి కూడా వెళ్ళడం ఇష్టం లేక చాలా వరకు పెద్ద సినిమాలని వాయిదా వేసుకున్నారు.
చిన్న సినిమాల నిర్మాతలు అయితే ఒటీటీ ఛానల్స్ ఇస్తున్న ఆఫర్స్ కి ఒకే చెప్పేసి డిజిటల్ రిలీజ్ కి రెడీ అయిపోతున్నారు.రీసెంట్ గా యూవీ కాన్సెప్ట్స్ బ్యానర్ నుంచి వచ్చిన ఎక్ మినీ కథ మూవీ అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ అయ్యింది.
పాజిటివ్ టాక్ తెచ్చుకుందని తెలుస్తుంది.ఇక ఈ వాయిదాల జాబితాలోకి అడవి శేష్ మేజర్ మూవీ కూడా చేరింది.
సూపర్ స్టార్ మహేష్ బాబు, సోనీ పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీని శశికిరణ్ తిక్కా తెరకెక్కించారు.
ఇక ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ జరుపుకుంది.
ముంబై టెర్రర్ ఎటాక్స్ లో ప్రాణాలు కోల్పోయిన రియల్ హీరో సందీప్ ఉన్ని కృష్ణన్ బయోపిక్ కథాంశంతో ఈ మూవీ తెరకెక్కింది.పాన్ ఇండియా రేంజ్ లోనే ఈ మూవీని రిలీజ్ చేయబోతున్నారు.
తెలుగు బాలీవుడ్ బ్యూటీ శోభిత, బాలీవుడ్ హీరోయిన్ సయీ మంజ్రేకర్ ఈ మూవీలో హీరోయిన్స్ గా నటించారు.ఇక కరోనా సెకండ్ లేకుండా ఉంటే జులై 2న ఈ మూవీ రిలీజ్ కావాల్సి ఉంది.
అయితే రిలీజ్ కి ఇంకా నెలరోజుల పైనే ఉన్నా కూడా ఇప్పట్లో థియేటర్స్ ఓపెన్ కావని క్లారిటీ రావడంతో మూవీని వాయిదా వేస్తున్నట్లు అడవి శేష్ తాజాగా ప్రకటించారు.కరోనా పరిస్థితుల కారణంగా విడుదల వాయిదా వేస్తున్నాం.
సినిమా కచ్చితంగా ఒక రేంజ్ లో ఉండబోతుంది.ఈ సక్సెస్ ని రిలీజ్ తర్వాత గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుందాం అంటూ ట్విట్టర్ లో పోస్ట్ పెట్టాడు.