ఆయుష్మాన్ ఖురానా హీరోగా గత ఏడాది ఆరంభంలో ప్రేక్షకులకి ముందుకి వచ్చి మంచి హిట్ టాక్ అందుకున్న సినిమా ఆర్టికల్ 15.ఈ సినిమాలో ఆయుష్మాన్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించాడు.
ఇక ఈ సినిమాని తెలుగులో రీమేక్ చేయడానికి సురేష్ బాబు రీమేక్ రైట్స్ సొంతం చేసుకున్నాడు.ఇక వెంకటేష్ హీరోగా ఈ కథలో కాస్తా మార్పులు చేసి తెరకెక్కించాలని నిర్మాత సురేష్ బాబు ప్లాన్ చేశాడు.
దానికి సంబంధించి స్క్రిప్ట్ వర్క్ కూడా ప్రస్తుతం జరుగుతుంది.కరోనా పరిస్థితుల కారణంగా ప్రాజెక్ట్ హోల్డ్ లో పెట్టారు.
అయితే ఇప్పుడు ఈ సినిమా హీరోగా తెరపైకి కుర్ర హీరో అడవి శేష్ వచ్చాడు. ప్రస్తుతం వెంకటేష్ నారప్ప సినిమాని ఫినిష్ చేసి తరువాత తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో ఒక సినిమాకి కమిట్ అయ్యాడు.
తరుణ్ భాస్కర్ సినిమా స్క్రిప్ట్ ఇప్పటికే రెడీగా ఉండటంతో దానిని తెరపైకి తీసుకెళ్ళే ప్రయత్నం జరుగుతుంది.అయితే మరల వెంకటేష్ ఫ్రీ అయ్యేంత వరకు ఆ రీమేక్ కథని హోల్డ్ లో ఉంచడం కరెక్ట్ కాదని భావించిన సురేష్ బాబు దానికి అడవి శేష్ అయితే సరిపోతాడని భావించి అతనిని ఫైనల్ చేసినట్లు తెలుస్తుంది.
అడవి శేష్ ప్రస్తుతం మేజర్ సినిమాతో పాటు గూఢచారి సీక్వెల్ ని తెరపైకి ఎక్కించాడు.ఇప్పటికే మేజర్ సినిమా మెజారిటీ షూటింగ్ కంప్లీట్ అయిపొయింది.గూఢచారి సీక్వెల్ కూడా త్వరలో సెట్స్ పైకి వెళ్ళిపోతుంది.దానిని ఫినిష్ చేసిన వెంటనే ఈ ఆర్టికల్ 15 రీమేక్ స్టార్ట్ చేయడానికి అడవి శేష్ ఒకే చెప్పినట్లు తెలుస్తుంది.
త్వరలో ఈ సినిమాకి సంబంధించి అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని ఇండస్ట్రీలో చెప్పుకుంటున్నారు.మొత్తానికి వెంకటేష్ చేయాల్సిన సినిమాని ఇప్పుడు అడవి శేష్ సొంతం చేసుకొని టాలీవుడ్ లో హీరోగా తనని తాను డిఫరెంట్ వే లో ప్రాజెక్ట్ చేసుకోవడానికి ఈ కుర్ర హీరో ప్రయత్నం చేస్తున్నాడు అని ఫిలిం నగర్ లో చెప్పుకుంటున్నారు.