టాలీవుడ్ యువ హీరో అడివి శేష్ తన వరుస సినిమాలతో సత్తా చాటుతున్నాడు.ఈ ఏడాది మేజర్, హిట్ 2 సినిమాలతో సక్సెస్ లు అందుకున్న అడివి శేష్ నెక్స్ట్ ఇయర్ గూఢచారి 2 తో రాబోతున్నాడు.
ఇక యంగ్ హీరోల్లో మంచి క్రేజ్ తెచ్చుకున్న అడివి శేష్ కి వాణిజ్య ప్రకటనలు వస్తున్నట్టు తెలుస్తుంది.లేటెస్ట్ గా ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ నుంచి శేష్ కి ఆఫర్ వచ్చిందట.
అందుకు అతను ఓకే చెప్పడం కూడా జరిగిందట.
రియల్ ఎస్టేట్ రంగంలో ఎప్పటినుంచో రాణిస్తున్న ఒక బ్రాండ్ కి అంబాసిడర్ గా దాన్ని ప్రమోట్ చేసేందుకు అడివి శేష్ రెడీ అయ్యాడు.
ఇందుకోసం అడివి శేష్ భారీ రెమ్యునరేషన్ డిమాండ్ చేసినట్టు తెలుస్తుంది.ఈ రియల్ ఎస్టేట్ యాడ్ కోసం అడివి శేష్ దాదాపు 50 లక్షల దాకా చార్జ్ చేసినట్టు తెలుస్తుంది.
సినిమాలు చేస్తూనే మరోపక్క ఇలా సైడ్ ఇంకం కోసం స్టార్స్ వాణిజ్య ప్రకటనలు చేయడం కామనే.అలాంటి స్టార్స్ లిస్ట్ లో ఇప్పుడు అడివి శేష్ కూడా చేరాడు.
ఇక మీదట యాడ్స్ తో కూడా అడివి శేష్ అదరగొడతాడని చెప్పొచ్చు.