హైదరాబాద్ లో కుమ్రం భీం ఆదివాసీ భవన్ ను త్వరలోనే ప్రారంభిస్తామని మంత్రి కేటీఆర్ తెలిపారు.ఆదివాసీల ఆత్మగౌరవం ప్రతిబింబించేలా బంజారాహిల్స్ రోడ్ నంబర్ 10లో నిర్మించిన భవనాన్ని ప్రారంభిస్తామని తన ట్వీట్లో పేర్కొన్నారు.
గూడెంలను గ్రామపంచాయతీలుగా తీర్చిదిద్ది ఆదివాసీల కళను సీఎం కేసీఆర్ తీర్చారని కొనియాడారు.జోడేఘాట్లో కుమ్రం భీం మ్యూజియంను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
అదేవిధంగా ఆసిఫాబాద్ జిల్లాకు కుమ్రం భీం జిల్లా అని నామకరణం చేశామన్నారు.