బాలకృష్ణ కెరియర్ లో ఎన్ని హిట్ సినిమాలు ఉన్న కూడా సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో వచ్చిన రెండు సినిమాలు గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి.అందులో ఆదిత్యా 369, భైరవద్వీపం ఎప్పుడు ప్రత్యేక స్థానం కలిగి ఉంటాయి.
సింగీతం శ్రీనివాసరావు అంటే అప్పట్లోనే హాలీవుడ్ స్టాండర్డ్స్ లో టెక్నికల్ వేల్యూస్ తో సినిమాలు తీసే దర్శకుడుగా తనదైన ముద్ర వేశాడు.అలాంటి దర్శక దిగ్గజంతో బాలకృష్ణ చేసిన ఈ రెండు సినిమాలలో ఒకటి సైన్స్ ఫిక్షన్ సినిమా కాగా, మరొకటి జానపద కథ.
టైం మిషన్ నేపధ్యంలో నడిచే కథాంశంతో ఆదిత్య 369 ఉంటుంది.ఇప్పటికి అలంటి సినిమా మరొకటి మన తెలుగు దర్శకులు తీయలేకపోయారు.
ఇక భైరవద్వీపం అంటే పాతాళభైరవి సినిమా స్ఫూర్తితో సింగీతం చేసిన ఈ జానపద కథాంశం అద్భుతమైన విజయం అందుకుంది.
ఈ రెండు సినిమాలకి ఇప్పుడు సీక్వెల్స్ తీయాలని ప్లాన్ చేస్తున్నారు.
అయితే అప్పట్లో టెక్నికల్ వండర్ గా తీసిన ఆ సినిమా కథాంశం భాగుండటంతో ప్రేక్షకులు కనెక్ట్ అయ్యారు.అయితే ఇప్పుడు వీటికి సీక్వెల్స్ తీయాలన్న, లేదంటే అదే కథలని ప్రెజెంట్ కి తగ్గట్లు మార్చి రీమేక్ చేయాలన్నా కత్తికి మించిన సామే అవుతుంది.
ప్రస్తుతం ఉన్న టెక్నాలజీ ప్రకారం ఈ సినిమాలని విజువల్ వండర్ గా ఆవిష్కరించాలి.అలా ఆవిష్కరించాలంటే కచ్చితంగా వందల కోట్ల బడ్జెట్ ని నిర్మాతలు సిద్ధం చేసుకోవాలి.
అయితే బాహుబలి పుణ్యమా అని వందల కోట్ల బడ్జెట్ అనేది ఇండియన్ సినిమాకి పెద్ద సమస్య కాదు.కాని వాటికి సీక్వెల్స్ అంటి ఆ స్థాయిలో కథాంశాలు మళ్ళీ రచయితలు సిద్ధం చేయాలి.
అలాగే వాటిని బాలకృష్ణతో తీయడం అంటే సాహసమే అని చెప్పాలి.ఈ నేపధ్యంలో ప్రస్తుతం చర్చల దశలో ఉన్న ఈ రెండు సినిమా సీక్వెల్స్ సెట్స్ పైకి వెళ్ళే అవకాశం ఉందా, ఉంటే వీటిని ఎవరు సింగీతంని మరిపించే విధంగా ఆవిష్కరిస్తారు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.