బాలీవుడ్ లో నటిగా సక్సెస్ అయ్యి టాలీవుడ్ లో అడుగుపెట్టిన హైదరాబాద్ బ్యూటీ అదితీరావ్ హైదరీ.ఈ అమ్మడు మోడలింగ్ లోకి వెళ్లిన తర్వాత మొదటిగా రచ్చ గెలిచి, తర్వాత సొంత ఇండస్ట్రీ అయిన తెలుగులోకి అడుగుపెట్టింది.అంతకంటేముందుగా తమిళంతో సౌత్ లోకి ఎంట్రీ ఇచ్చింది.స్టార్ హీరోయిన్ రేంజ్ కాకపోయినా తెలుగులో అడపాదడపా ఈ అమ్మడు సినిమాలు చేస్తూనే ఉంది.రొటీన్ హీరోయిన్ పాత్రల జోలికి వెళ్లకుండా, సినిమాలో ప్రాధాన్యత ఉన్న పాత్రలకి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తున్న అదితీరావ్ అందుకు తగ్గట్లుగానే తన సినిమా సెలక్షన్ ఉండేలా చూసుకుంటుంది.ప్రస్తుతం ఈ అమ్మడు వి సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చింది.
ఇందులో ఆమె నటించిన సాహెబా అనే పాత్ర నిడివి తక్కువ అయినా అదితీరావ్ చేయడానికి ఒప్పుకుంది.నిజానికి సినిమా మొత్తం సాహెబా పాత్ర పాయింట్ అఫ్ వ్యూలోనే తిరుగుతుంది.
ఈ కారణంగానే అదితీరావ్ వి సినిమా చేయడానికి ఒప్పుకున్నట్లు తాజాగా ఓ ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చింది. సినిమాకు హార్ట్ లాంటి పాత్రలో నటించటం చాలా ఆనందంగా ఉంది.
సినిమాలోని నా పాత్ర నిడివి తక్కువగా ఉండటం గురించి అందరూ మాట్లాడుతున్నారు.కానీ ఓ సినిమాలో ఎన్ని నిమిషాలు కనబడ్డాం అనేది ముఖ్యం కాదు.
ఆ పాత్రలో ఎంత బాగా నటించాం.దానికి ఎంత పేరొచ్చింది అనేది ఇంపార్టెంట్.
ఇంద్రగంటి మోహనకృష్ణగారే నన్ను తెలుగు సినిమాకి పరిచయం చేశారు.ఆయన దర్శకత్వంలో సినిమా చేయటం బావుంటుంది.
ఆయన సినిమాలో క్యారెక్టర్స్ మాట్లాడే విధానం కొత్తగా ఉంటుంది.వి సినిమాని థియేటర్లలో ప్రేక్షకులతో కలిసి చూద్దామనుకున్నాను.
అది మిస్సయ్యాను.ప్రస్తుత పరిస్థితుల్లో ఈ చిత్రాన్ని డిజిటల్లో రిలీజ్ చేయాలన్నది మంచి నిర్ణయమే.
ప్రస్తుతం నేను బాలీవుడ్ సినిమా షూటింగ్స్లో పాల్గొంటున్నాను.మొత్తం ఆరు సినిమాలు చేతిలో ఉన్నాయని అదితీరావ్ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.