ఆది పురుష్ తన సినిమాకి ప్లస్ అవుతుంది అంటున్న నాగ్ అశ్విన్

డార్లింగ్ ప్రభాస్ తో నాగ్ అశ్విన్ ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్ తో సైన్స్ ఫిక్షన్ మూవీ ప్లాన్ చేస్తున్న సంగతి తెలిసిందే.అశ్వినీదత్ ఏకంగా 450 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు.

 Adipurush Will Help My Film Reach A Wider Audience , Nag Ashwin, Darling Prabhas-TeluguStop.com

ఇక ఈ సినిమా ఈ ఏడాది ఆఖరులో సెట్స్ పైకి వెళ్ళే అవకాశం ఉంది.రాదే శ్యామ్ సినిమా షూటింగ్ అవుతూ ఉండగానే నాగ్ అశ్విన్ సినిమా కన్ఫర్మ్ అయ్యింది.

అయితే తరువాత కన్ఫర్మ్ అయిన ఆది పురుష్, సలార్ సినిమా షూటింగ్ లు దానికంటే ముందు సెట్స్ పైకి వెళ్ళిపోయాయి.ఈ రెండు సినిమాలు కూడా పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కుతున్నవే.

ఇందులో ఒకటి మైథలాజికల్ స్టొరీ కాగా మరొకటి మాఫియా కథాంశంతో తెరకెక్కుతుంది.ఈ రెండు సినిమాలని ఒకే సారి సెట్స్ పైకి తీసుకెళ్ళి ఒకే సారి పూర్తి చేయాలని ప్రభాస్ షెడ్యూల్ ప్లాన్ చేసుకున్నాడు.

ఇదిలా ఉంటే నాగ్ అశ్విన్ మూవీకి సంబంధించి పెద్దగా అప్డేట్స్ రావడం లేదు.

ఇదిలా ఉంటే తాజాగా తన సినిమా ఆలస్యం అవ్వడంపై నాగ్ అశ్విన్ క్లారిటీ ఇచ్చాడు.

ప్రస్తుతం ఈ సినిమా కోసం పని చేస్తున్న ఆర్ట్ డైరెక్టర్, కాస్ట్యూమ్ డిజైనర్ ప్రత్యేకంగా ట్రైనింగ్ తీసుకుంటున్నారు.సినిమా నేటివిటీ కోసం వారు మరింత వర్క్ చేస్తున్నారు.

ఈ కారణంగా సినిమా ఆలస్యం అవుతుంది.అయితే ఈ ఆలస్యం కూడా ఒకందుకు మంచికే అంటూ నాగ్ అశ్విన్ కామెంట్స్ చేశాడు.

ప్రస్తుతం తెరకెక్కుతున్న ఆది పురుష్ సినిమాతో దేశ వ్యాప్తంగా ప్రతి గ్రామానికి ప్రభాస్ ఇమేజ్ స్ప్రెడ్ అవుతుంది.మైథలాజికల్ స్టొరీ కావడంతో అందరూ కనెక్ట్ అవుతారు.

ఈ ఇమేజ్ తన సినిమాతో తన ప్రాజెక్ట్ కి 30 శాతం అదనంగా ఆదరణ వస్తుందని పేర్కొన్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube