యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఇప్పటికే షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న సంగతి తెలిసిందే.ఈ సినిమాతో మరోసారి బాక్సాఫీస్ను షేక్ చేసేందుకు ప్రభాస్ రెడీ అవుతున్నాడు.
కాగా ఈ సినిమా తరువాత తన నెక్ట్స్ చిత్రాలను కూడా లైన్లో పెట్టి వాటిని కూడా తెరకెక్కించేందుకు ప్రభాస్ రెడీ అవుతున్నాడు.ఈ క్రమంలో డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ తన నెక్ట్స్ చిత్రాన్ని అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే.
ఇక ఈ సినిమా తరువాత మరో చిత్రాన్ని బాలీవుడ్ దర్శకుడు ఓం రావుత్ డైరెక్షన్లో తెరకెక్కించేందుకు సిద్ధమయ్యాడు.ఇక ఈ సినిమాతో మరోసారి పాన్ ఇండియా రేంజ్లో బాక్సాఫీస్కు చుక్కలు చూపెట్టేందుకు ప్రభాస్ రెడీ అవుతున్నాడు.
కాగా ఈ సినిమాకు ‘ఆదిపురుష్’ అనే టైటిల్ను చిత్ర యూనిట్ ఇప్పటికే అనౌన్స్ చేయగా, ఈ సినిమాలో ప్రభాస్ రాముడి పాత్రలో నటిస్తాడనే వార్త ఇండస్ట్రీ వర్గాలతో పాటు ప్రేక్షకుల్లో కూడా భారీ అంచనాలను క్రియేట్ చేసింది.అయితే ఈ సినిమాలో హీరోయిన్ ఎవరనే విషయంపై మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు.
కాగా ఈ సినిమాలో సౌత్ నుండి హీరోయిన్ను తీసుకుంటారని అందరూ అనుకున్నారు.కానీ ఈ సినిమాకు బాలీవుడ్ బ్యూటీ అయితే బాగుంటుందని చిత్ర యూనిట్ భావిస్తోంది.
ఈ క్రమంలోనే కృతి సనాన్ పేరును ఈ సినిమాలో హీరోయిన్గా ఎక్కువగా వినిపిస్తోంది.ఒకవేళ ఆమె ఈ సినిమాలో సెలెక్ట్ కాకపోయినా, మరో బాలీవుడ్ బ్యూటీకే అవకాశం ఇవ్వాలని చిత్ర యూనిట్ భావిస్తోంది.
అంటే, ఏదేమైనా ఆదిపురుష్ చిత్రానికి కేవలం బాలీవుడ్ భామనే ఎంపిక చేసేందుకు ఆదిపురుష్ నిర్ణయించుకున్నట్లు తేలిపోయింది.మరి ఈ సినిమాలో హీరోయిన్ ఛాన్స్ను ఎవరు దక్కించుకుంటారో అనేది చూడాలి.