బాహుబలి హీరో ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘రాధేశ్యామ్’ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ఇక ఈ సినిమాను పాన్ ఇండియా మూవీగా భారీ స్థాయిలో రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.
ఇప్పటికే దర్శకుడు నాగ్ అశ్విన్ డైరెక్షన్లో తన నెక్ట్స్ మూవీని అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే.కాగా ఈ సినిమా తరువాత తన నెక్ట్స్ మూవీని కూడా ప్రభాస్ ఇటీవల అనౌన్స్ చేశాడు.
బాలీవుడ్ దర్శకుడు ఓం రావుత్ డైరెక్షన్లో మరో భారీ పాన్ ఇండియా మూవీ ‘ఆదిపురుష్’ను తెరకెక్కించేందుకు ప్రభాస్ పచ్చజెండా ఊపాడు.అయితే ఈ సినిమాను అత్యంత భారీ బడ్జెట్తో తెరకెక్కించేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.
కాగా ఈ సినిమాను రామాయణం ఆధారంగా తెరకెక్కించేందుకు చిత్ర యూనిట్ సిద్ధం అవుతోంది.కాగా ఈ సినిమా షూటింగ్ను ఏ సీన్స్తో తెరకెక్కిస్తారా అని అందరూ ఆసక్తిగా చూస్తు్న్నారు.
అయితే ఈ సినిమా షూటింగ్ను తొలుత వీఎఫ్ఎక్స్ సన్నివేశాలతో తెరకెక్కించేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.ఈ సినిమాను 3D రూపంలో తెరకెక్కించేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.
కాగా ఈ సినిమాలో రావణుడి పాత్రలో బాలీవుడ్ హీరో సైఫ్ అలీ ఖాన్ నటిస్తున్నట్లు చిత్ర యూనిట్ అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే.మరి ఈ సినిమా షూటింగ్ను ఎప్పటినుండి ప్రారంభిస్తారో చూడాలి.
కాగా ఈ సినిమాను టీ-సిరీస్ అత్యంత భారీ బడ్జెట్తో తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే.