యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుసబెట్టి సినిమాలను ఓకే చేస్తూ ప్రేక్షకులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాడు.ఇప్పటికే రాధేశ్యామ్ చిత్రాన్ని రిలీజ్కు రెడీ చేస్తున్న ప్రభాస్, ఈ సినిమా రిలీజ్ కాకముందే తన నెక్ట్స్ చిత్రాలను వరుసబెట్టి అనౌన్స్ చేస్తున్నాడు.
ఈ క్రమంలో నాగ్ అశ్విన్ డైరెక్షన్లో ఓ సినిమాను అనౌన్స్ చేసిన ప్రభాస్, బాలీవుడ్ దర్శకుడు ఓం రావుత్ డైరెక్షన్లో ఆదిపురుష్ అనే సినిమాను కూడా అనౌన్స్ చేశాడు.ఇక ఈ రెండు చిత్రాల గురించి గతకొద్ది రోజులుగా సోషల్ మీడియాలో అనేక వార్తలు వినిపిస్తూ వస్తున్నాయి.
తాజాగా ఆదిపురుష్ చిత్రం కథ గురించి సోషల్ మీడియాలో ఓ వార్త చక్కర్లు కొడుతోంది.ఈ సినిమా కథ రామాయణం ఆధారంగా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.అయితే ఈ సినిమాలో రావణాసురిడి పాత్రలో బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ నటిస్తుండగా రాముడిగా ప్రభాస్ కనిపిస్తాడు.కాగా ఈ సినిమా కథ రాముడి రివెంజ్ డ్రామా కోణంలో కాకుండా సరికొత్త కోణంలో ఉండబోతున్నట్లు తెలుస్తోంది.
ఈ సినిమాలో రావణాసురిడి మంచి మనసు కారణంగా రాముడితో యుద్ధం జరగడం అనే కోణంలో కథను మనకు చూపించనున్నట్లు తెలుస్తోంది.మొత్తానికి ఆదిపురుష్ చిత్రాన్ని సరికొత్త కోణంలో చూపించి ప్రేక్షకుల్లో ఆసక్తి పెంచేందుకు రెడీ అవుతున్నారు.
ఇక ఈ సినిమాలో ప్రభాస్ సరసన హీరోయిన్గా ఎవరు నటిస్తున్నారా అనే అంశంపై ఇంకా క్లారిటీ రాలేదు.కాగా ఈ సినిమాతో మరోసారి ఇండియన్ బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేసేందుకు ప్రభాస్ అండ్ టీమ్ రెడీ అవుతున్నారు.
ఇక ఈ సినిమాను అత్యంత భారీ బడ్జెట్తో టీసిరీస్ ప్రొడ్యూస్ చేస్తుండటంతో ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి అంటున్నారు అభిమానులు.కాగా ప్రభాస్ తాజాగా ‘సలార్’ అనే సినిమాను అనౌన్స్ చేయడంతో ప్రేక్షకులు అవాక్కవుతున్నారు.