పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ చేతిలో ప్రెసెంట్ నాలుగైదు ప్రాజెక్టులు ఉన్నాయి.ఇటీవలే రాధేశ్యామ్ సినిమాతో వచ్చి ప్రేక్షకులను నిరాశ పరిచాడు.
బాహుబలి సిరీస్ తర్వాత ప్రభాస్ నుండి వచ్చిన సాహో, రాధేశ్యామ్ రెండు సినిమాలు కూడా డార్లింగ్ ఫ్యాన్స్ ను నిరాశ పరిచాయి.దీంతో ఈయన తర్వాత సినిమా అప్డేట్ కోసం ఎదురు చూస్తున్నారు.
ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న సినిమాల్లో ఆదిపురుష్ ఒకటి.పాన్ ఇండియా నుండి పాన్ వరల్డ్ లెవల్లో రిలీజ్ కు రెడీ అవుతున్న సినిమా ఆదిపురుష్ కావడంతో ఈ సినిమా కోసం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
ప్రెసెంట్ పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపు కుంటున్న ఈ సినిమాలో సీత గా కృతి సనన్ నటిస్తుంది.లంకేశ్వరుడు రావణాసురిడిగా సైఫ్ అలీ ఖాన్ నటిస్తుండగా.లక్ష్మణ్ గా సన్నీ సింగ్ నటిస్తున్నాడు.
ఈ సినిమాను టి సిరీస్ సంస్థ 500 కోట్ల ఖర్చు చేసినట్టు టాక్.
ఈ సినిమా 2023 సంక్రాంతి కానుకగా రిలీజ్ కానుంది.అయితే ఈ సినిమా కోసం ఎదురు చూసే ఫ్యాన్స్ కు ఇది బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి.
ఆదిపురుష్ షూటింగ్ మొత్తం పూర్తి అయినా కనీసం ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా రిలీజ్ కాకపోవడంతో డార్లింగ్ ఫ్యాన్స్ నిరాశలో ఉన్నారు.
అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం మరొక రెండు మూడు నెలల వరకు కూడా ఇదే యవ్వారం సాగనుందట.ఇప్పట్లో ఈ సినిమా నుండి ఒక అప్డేట్ ను ఆశించడం కూడా కష్టమే అంటున్నారు.ఇప్పటికే ఫ్యాన్స్ మేకర్స్ పై గుర్రుగా ఉన్నారు.
ఇక ఇప్పట్లో అప్డేట్ లేదు అంటే అప్పటి వరకు ఫ్యాన్స్ ను ఎలా మానేజ్ చేస్తారో చూడాలి.