బాహుబలి సిరీస్ తర్వాత పాన్ ఇండియా స్టార్ గా ప్రభాస్ కు ఫ్యాన్స్ కూడా అదే స్థాయిలో ఉన్నారు.ఈయన సినిమా కోసం ఎదురు చూసే ప్రేక్షకులు చాలా మంది ఉన్నారు.
అయితే బాహుబలి తర్వాత వచ్చిన రెండు సినిమాలతో ఈయన ఫ్యాన్స్ ను పూర్తిగా నిరాశ పరిచాడు.దీంతో ఇప్పుడు అందరి ఆశలు నెక్స్ట్ రిలీజ్ కాబోతున్న ఆదిపురుష్ సినిమా మీదనే ఉన్నాయి.
ఈ సినిమా కోసం ఆయన ఫ్యాన్స్ మాత్రమే కాదు సాధారణ ప్రేక్షకులు కూడా వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నారు.
అందులోను ఈ సినిమా భారీ స్థాయిలో తెరకెక్కింది.
బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఎప్పుడో షూటింగ్ ముగించుకుంది.ప్రెసెంట్ పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపు కుంటున్న ఈ సినిమా నుండి ఒక్క అప్డేట్ కూడా రాలేదు.
ఈ నెలలో అప్డేట్ వస్తుంది అని.మరో నెలలో వస్తుంది అని న్యూస్ వైరల్ అవుతూనే ఉన్నాయి.కానీ ఇప్పటి వరకు ఒక్క అప్డేట్ కూడా రాకపోవడం గమనార్హం.
ఈ నేపథ్యంలోనే ఈ రోజు ఉదయాన్నే ప్రభాస్ ఫ్యాన్స్ కు స్పెషల్ ట్రీట్ ఇచ్చారు ఆదిపురుష్ మేకర్స్.
ఈ సినిమా నుండి టీజర్ ను రిలీజ్ చేయడానికి ముహూర్తం ఫిక్స్ చేసారు.
అలాగే ఆదిపురుష్ నుండి ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేసారు.దీంతో అందరికి ఉదయాన్నే మంచి ఎనర్జిటిక్ గా అనిపించింది.ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న అప్డేట్ ఈ రోజు రావడంతో ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.
ఇక ఈ టీజర్ ఫస్ట్ లుక్ పోస్టర్ చూసి అంచనాలు ఓ రేంజ్ లోకి వెళ్లాయి.ఈ పోస్టర్ చుసిన అందరికి గూస్ బంప్స్ వస్తున్నాయి.ఇక టీజర్ ను అక్టోబర్ 2న సాయంత్రం 7 గంటల 11 నిముషాలకు రిలీజ్ చేస్తున్నట్టు చెప్పి ప్రభాస్ ఫ్యాన్స్ కు పండుగ ముందే సంతోషకరమైన వార్త అందించారు.ఇలా మొత్తానికి సడన్ సర్ప్రైజ్ ఇచ్చి ఫ్యాన్స్ ను అయితే ఖుష్ చేసారు.
చూడాలి టీజర్ ఇంకెంత గూస్ బంప్స్ తెప్పిస్తుందో.