ప్రభాస్ కెరీర్ లో అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కిన సినిమాలలో ఆదిపురుష్ సినిమా కూడా ఒకటనే సంగతి తెలిసిందే.ఇప్పటివరకు ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్ కూడా విడుదల కాకపోయినా 2023 సంక్రాంతి కానుకగా విడుదల కానున్న ఈ సినిమా కొరకు అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఈ సినిమా కోసం ఏకంగా 500 కోట్ల రూపాయలను నిర్మాతలు ఖర్చు చేయగా శాటిలైట్, డిజిటల్ హక్కుల ద్వారా నిర్మాతలకు భారీస్థాయిలో ఆదాయం వచ్చిందని తెలుస్తోంది.
ఆదిపురుష్ తెలుగు రాష్ట్రాల హక్కులు ఏకంగా 100 కోట్ల రూపాయలకు పైగా అమ్ముడయ్యాయని సమాచారం.
మైథలాజికల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన సినిమా అయినా ఈ స్థాయిలో థియేట్రికల్ హక్కులు అమ్ముడవడం ప్రభాస్ కు మాత్రమే సాధ్యమని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నారు.మరోవైపు ప్రభాస్ నటించిన సలార్ సినిమా నుంచి రేపు మధ్యాహ్నం ఒక అప్డేట్ రానుందని అధికారిక ప్రకటన వెలువడింది.
ఈ అప్డేట్ తో పాటు సలార్ మూవీ రిలీజ్ డేట్ కు సంబంధించి అధికారిక ప్రకటన వస్తుందని ప్రభాస్ అభిమానులు భావిస్తున్నారు.ప్రభాస్ సినిమాలన్నీ పాన్ ఇండియా సినిమాలుగా అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్నాయి.
రాజమౌళి డైరెక్షన్ లో ప్రభాస్ హీరోగా తెరకెక్కిన బాహుబలి2 సినిమా ఏకంగా 1800 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ కలెక్షన్లను సాధించడంతో ప్రభాస్ తో సినిమాలను నిర్మించే నిర్మాతలెవరూ ఖర్చు విషయంలో రాజీ పడటం లేదు.
సాహో, రాధేశ్యామ్ సినిమాలు ఫ్లాప్ అయినా ప్రభాస్ కు ఉన్న క్రేజ్ వల్లే ఈ సినిమాలకు భారీ మొత్తంలో నష్టాలు రాలేదు.ప్రభాస్ భవిష్యత్ ప్రాజెక్ట్ లతో ఇండస్ట్రీ హిట్లు సాధించి కొత్త రికార్డులను క్రియేట్ చేయాలని అభిమానులు భావిస్తున్నారు.ప్రభాస్ తర్వాత ప్రాజెక్ట్ లతో ఎలాంటి ఫలితాలను అందుకుంటారో చూడాల్సి ఉంది.