యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఇప్పటికే మెజారిటీ షూటింగ్ ముగించుకుంది.ఈ సినిమా రిలీజ్ కాకముందే ప్రభాస్ తన నెక్ట్స్ చిత్రాలను వరుసబెట్టి ఓకే చేస్తూ దూసుకుపోతున్నాడు.
కాగా ఈ క్రమంలో దర్శకుడు నాగ్ అశ్విన్ డైరెక్షన్లో తన నెక్ట్స్ మూవీని ఓకే చేసిన ప్రభాస్, ఆ తరువాత బాలీవుడ్ దర్శకుడు ఓం రావుత్ డైరెక్షన్లో ఆదిపురుష్ అనే సినిమాను చేయనున్నాడు.కాగా ఈ సినిమా తరువాత సలార్ అనే సినిమాలో కూడా ప్రభాస్ నటించనున్నట్లు తెలిపాడు.
అయితే బాలీవుడ్లో తెరకెక్కనున్న ఆదిపురుష్ చిత్రాన్ని పాన్ ఇండియా మూవీగా అత్యంత భారీ బడ్జెట్తో తెరకెక్కిస్తున్నట్లు దర్శకుడు ఓం రావుత్ తెలిపాడు.ఇక రామాయణం ఆధారంగా ఈ సినిమా వస్తుండటంతో ఈ సినిమాకు అదిరిపోయే వీఎఫ్ఎక్స్ ఉండబోతున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది.
కాగా ఈ సినిమాకు సంబంధించిన పనులను ఇప్పటికే చిత్ర యూనిట్ ప్రారంభించినట్లు తెలుస్తోంది.అయితే రెగ్యులర్ షూటింగ్ కాకుండా కేవలం వీఎఫ్ఎక్స్ పనులు మాత్రమే మొదలైనట్లు తెలుస్తోంది.
ఈ సినిమాలో రియాలిటీ సీన్స్ కంటే ఎక్కువగా వీఎఫ్ఎక్స్ సీన్స్ ఉంటాయని, అందుకే వాటికి సంబంధించిన పనులు మొదలుపెట్టాడట దర్శకుడు ఓం రావుత్.
ఇక ప్రభాస్ రాముడి పాత్రలో నటిస్తుండగా, ఈ సినిమాలో రావణాసురిడి పాత్రలో బాలీవుడ్ హీరో సైఫ్ అలీ ఖాన్ నటిస్తున్నాడు.
అయితే సీత పాత్రలో ఎవరు చేస్తారనే అంశంపై మాత్రం ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.ఇక ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ను జనవరి నెలలో మొదులుపెట్టాలని చిత్ర యూనిట్ భావిస్తోంది.
కాగా ఈ సినిమా మరోసారి ఇండియన్ బాక్సాఫీస్ను షేక్ చేసేందుకు ప్రభాస్ రెడీ అవుతున్నాడు.పూర్తి హిస్టారికల్ మూవీగా రానున్న ఈ సినిమా ఎలాంటి రికార్డులను క్రియేట్ చేస్తుందో తెలియాలంటే ఆదిపురుష్ చిత్రం రిలీజ్ అయ్యే వరకు ఆగాల్సిందే.