యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఇప్పటికే రిలీజ్కు రెడీ అయిన సంగతి తెలిసిందే.ఈ సినిమా ఇంకా రిలీజ్ కాకముందే ప్రభాస్ తన నెక్ట్స్ చిత్రాలను వరుసబెట్టి క్యూలో పెడుతూ స్పీడుమీదున్నాడు.
ఈ క్రమంలో బాలీవుడ్ డైరెక్టర్ ఓం రావుత్ దర్శకత్వంలో ఆదిపురుష్ అనే పాన్ ఇండియా మూవీని తెరకెక్కించేందుకు ప్రభాస్ రెడీ అయ్యాడు.కాగా పూర్తి హిస్టారికల్ మూవీగా ఈ సినిమాను తెరకెక్కించేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది. ఈ సినిమాను అనౌన్స్ చేసి చాలా రోజులే అయ్యింది.కాగా తాజాగా ఈ సినిమా షూటింగ్ను ప్రారంభించినట్లు హీరో ప్రభాస్ తెలిపాడు.‘ఆదిపురుష్ ఆరంభ్’ అంటూ సోషల్ మీడియాలో ట్వీట్ చేశాడు.రామాయణం ఆధారంగా ఈ హిస్టారికల్ చిత్రాన్ని అత్యంత భారీ బడ్జెట్తో టీ-సిరీస్ ప్రొడ్యూస్ చేస్తున్న సంగతి తెలిసిందే.
కాగా ఈ సినిమాలో రావణాసురిడి పాత్రలో బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ నటిస్తున్నట్లు చిత్ర యూనిట్ అనౌన్స్ చేసింది.ఇక రాముడి పాత్రలో ప్రభాస్ భారీ మేకోవర్ చేయబోతున్నట్లు తెలుస్తోంది.
కాగా ఈ సినిమాలో సీత పాత్రలో ఎవరు నటిస్తారా అనే అంశం మాత్రం మిలియన్ డాలర్ ప్రశ్నగా మారింది. ఇప్పటికే ఈ పాత్ర కోసం చాలా మంది హీరోయిన్ల పేర్లు వినిపించాయి.
కానీ వారెవ్వరినీ ఆదిపురుష్ చిత్ర యూనిట్ ఇంకా ఓకే చేయలేదని తెలుస్తోంది.మరి ప్రభాస్ సరసన ఈ సినిమాలో హీరోయిన్గా నటించే అవకాశం ఎవరు దక్కించుకుంటారో చూడాలి.
ఇక పాన్ ఇండియా మూవీగా రానున్న ఈ సినిమా షూటింగ్ను ముంబైలో ప్రారంభించగా, త్వరలోనే ప్రభాస్ ఈ షూటింగ్లో జాయిన్ కానున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది.ఈ సినిమాను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోంది.