పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పీరియాడిక్ డ్రామా ‘ఆదిపురుష్’.రామాయణం నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను ఓం రౌత్ విజువల్ వండర్ గా తెరకెక్కిస్తున్నారు.‘ఆదిపురుష్‘ సినిమా షూటింగ్ ఇప్పటికే ముగించేసి గుమ్మడి కాయ కొట్టిన విషయం కూడా తెలిసిందే.
ఈ సినిమా షూటింగ్ పూర్తి అవ్వడంతో అనుకున్న సమయానికే రిలీజ్ అవుతుంది అని ఫ్యాన్స్ ఖుషీగా ఉన్నారు.
ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన గ్రాఫిక్స్ వర్క్ చేస్తున్నారు.దాదాపు 500 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మిస్తున్నారని, ఈ పెద్ద బడ్జెట్ లో 300 కోట్లు గ్రాఫిక్స్ కే ఖర్చు చేస్తున్నారని వార్తలు వినియోగిస్తున్నారని ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే.
అయితే ఈ ప్రచారంలో ఎంత మాత్రం నిజం లేదని మేకర్స్ చెబుతున్నారు.తాజాగా ఆదిపురుష్ బడ్జెట్ గురించి మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.ఈ సినిమాను 400 కోట్ల రూపాయలతో నిర్మించామని ప్రకటన చేసారు.ఈ భారీ మొత్తంలో మెజార్టీ పార్ట్ ను గ్రాఫిక్స్ కోసం వినియోగిస్తున్నారని చెప్పారు.కానీ గ్రాఫిక్స్ కోసం ఎంత అమౌంట్ ఖర్చు చేస్తున్నారో అనేది క్లారిటీగా చెప్పలేదు.
అలాగే ప్రభాస్ కు పారితోషికంగా 100 కోట్ల రూపాయలను ఇస్తున్నట్టు కూడా వార్తలు వచ్చాయి.ఆ విషయంపై కూడా క్లారిటీ ఇవ్వలేదు.కానీ ప్రభాస్ నటించిన ఈ సినిమాపై దేశ వ్యాప్తంగా అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి.
అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా దర్శకుడు ఓం రౌత్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు.ఇండియాలోనే అతి పెద్ద మోషన్ గ్రాఫిక్స్ మూవీగా ఈ సినిమా నిలువబోతున్నట్టుగా ఇండస్ట్రీ వర్గాల వారు చెబుతున్నారు.
ఈ సినిమాను 2022 ఆగస్టు 11న విడుదల చేయబోతున్నట్టు ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే.