ప్రభాస్ ప్రస్తుతం రాధే శ్యామ్ సినిమా పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంచారు.రాధే శ్యామ్ సినిమాలో ప్రభాస్ కు జంటగా పూజ హెగ్డే నటిస్తున్నారు.
ఈ సినిమాను జులై 30 న విడుదల చేయబోతున్నారు.ప్రభాస్ బాహుబలి చిత్రంతో తన స్టామినాను ఒక్కసారిగా పెంచుకున్నాడు.
అంతేకాదు తన మార్కెట్ కూడా అమాంతం పెరిగింది.అందుకే వరస పెట్టి అన్ని పాన్ ఇండియా సినిమాలు చేస్తున్నాడు.
రాధే శ్యామ్ సినిమా తర్వాత వెంటనే గ్యాప్ లేకుండాసలార్, ఆది పురుష్ సినిమాలు ప్రకటించి ఇప్పటికే షూటింగ్ కూడా ప్రారంభించేసారు.ప్రభాస్ సలార్ సినిమాను కెజిఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్నాడు.
ప్రశాంత్ నీల్ ఈ సినిమాను ఉగ్రం సినిమాకు రీమేక్ గా తెరకెక్కిస్తున్నారు.ఈ సినిమాలో హీరోయిన్ గా శృతి హాసన్ నటిస్తుంది.
ఆదిపురుష్ సినిమాకు ఓం రౌత్ దర్శకత్వం వహిస్తున్నారు.
ఆదిపురుష్ సినిమా రామాయణం నేపథ్యంలో తెరకెక్కుతుంది.ఈ సినిమాలో ప్రభాస్ రాముడిగా, కృతి సనన్ సీతగా, సైఫ్ అలీ ఖాన్ రావణాసురిడిగా నటిస్తున్నారు.ప్రస్తుతం ముంబైలో ఆదిపురుష్ షూటింగ్ జరుగుతుంది.
ఈ సినిమాను విజువల్ వండర్ గా తెరకెక్కిస్తున్నారు.ఈ సినిమాను టి సిరీస్ సంస్థ 500 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తుండగా 60 శాతం బడ్జెట్ గ్రాఫిక్స్ కోసమే ఉపయోగిస్తున్నారని సమాచారం.
అయితే ప్రస్తుతం ఈ సినిమాపై లేటెస్ట్ అప్డేట్ వచ్చింది.ముంబైలో జరుగుతున్న షూటింగ్ లో ఇప్పటి వరకు ప్రభాస్ పై కొన్ని కీలక సన్నివేశాలను తెరకెక్కించారు.ఇప్పుడు ప్రభాస్ కు, కృతి సనన్ కు మధ్య వచ్చే ఒక సాంగ్ ను తెరకెక్కించబోతున్నారని సమాచారం.ఈ సినిమాను వీలైనంత త్వరగా పూర్తి చేసి వచ్చే సంవత్సరం ఆగస్టు 11 న విడుదల చేయాలనీ చిత్ర యూనిట్ భావిస్తున్నారు.