ఏ సినిమాను అయినా ప్రేక్షకుల్లో కానీ.అభిమానుల్లో కానీ ఆసక్తి కలిగించేలా చేయాలంటే ఆ సినిమాకు సంబంధించి అన్ని విషయాలు పర్ఫెక్ట్ గా ఉండాలి.
అలాగే సినిమాకు ముందు చేసే ప్రొమోషన్స్ కూడా ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉండాలి.అప్పుడే ఎంత పెద్ద స్టార్ హీరో సినిమాకు అయినా అంచనాలు పెరిగి పోతాయి.
కానీ ప్రమోషనల్ పరంగా కంటెంట్ బాగాలేక పోతే ఆ సినిమాపై ఆసక్తి తగ్గిపోతుంది.
మరి ఇప్పుడు మన పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ చేస్తున్న ఆదిపురుష్ సినిమా విషయంలో కూడా ఇదే జరుగుతుంది.
ప్రభాస్, బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ హీరో హీరోయిన్లుగా తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ సినిమా ”ఆదిపురుష్”.రామాయణం ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాను బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ తెరకెక్కించారు.
ఇందులో ప్రభాస్ రాముడిగా నటిస్తుంటే.సీతగా కృతి సనన్ నటిస్తుంది.
లంకేశ్వరుడు రావణాసురిడి పాత్రలో బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ నటిస్తుండగా.లక్ష్మణుడిగా బాలీవుడ్ నటుడు సన్నీ సింగ్ నటిస్తున్నాడు.ఇక ఇటీవలే ఈ సినిమా నుండి టీజర్ రిలీజ్ చెయ్యగా భారీ ట్రోలింగ్ చేసిన విషయం తెలిసిందే.ఓం రౌత్ రామాయణం మొత్తం మార్చి తీసారని పెద్ద ఎత్తున నిరసనలు వచ్చాయి.
దీంతో ఈ సంక్రాంతికి రిలీజ్ కావాల్సిన సినిమాను జూన్ 16కు వాయిదా వేశారు.
ఇక ఈ క్రమంలోనే తాజాగా ఈ సినిమా నుండి ఒక అప్డేట్ ఇచ్చారు మేకర్స్.#150DaystoAdipurush అనే హ్యాష్ ట్యాగ్ ను ట్రెండ్ చేసారు.ఇందుకు ఒక పోస్టర్ కూడా రిలీజ్ చేసారు.
అయితే ఈ పోస్టర్ కు అనుకున్న రేంజ్ లో రెస్పాన్స్ రాలేదు.కొత్త టీజర్ ను కానీ ట్రైలర్ కానీ రిలీజ్ చేస్తారు అనుకుంటే ఇలాంటి హ్యాష్ ట్యాగ్ ను ట్రెండ్ చేయడంతో అభిమానులు ఆసక్తి చూపించడం లేదు.
మరి ఏదొక సాలిడ్ అప్డేట్ వస్తే కానీ ఈ సినిమా ఆశించిన అంచనాలు అందుకునేలా కనిపిస్తుంది.