ప్రస్తుతం ప్రభాస్ రాధే శ్యామ్ సినిమా పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంచాడు.ఈ సినిమాను జులై 30 న విడుదల చేయబోతున్నట్టు ఇప్పటికే ప్రకటించారు.
ఈ సినిమాను రాధాకృష్ణ డైరెక్ట్ చేస్తున్నారు.రాధే శ్యామ్ సినిమాలో ప్రభాస్ కు జంటగా పూజ హెగ్డే నటిస్తున్నారు.
ప్రభాస్ బాహుబలి చిత్రంతో తన మార్కెట్ అమాంతం పెరగడంతో వరస పెట్టి అన్ని పాన్ ఇండియా సినిమాలు చేస్తున్నాడు.
ప్రభాస్ రాధే శ్యామ్ సినిమా తర్వాత వెంటనే గ్యాప్ లేకుండా సలార్, ఆది పురుష్ సినిమాలు ప్రకటించి ఇప్పటికే షూటింగ్ కూడా ప్రారంభించేసారు.
ప్రభాస్ సలార్ సినిమాను కెజిఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్నాడు.ప్రశాంత్ నీల్ ఈ సినిమాను ఉగ్రం సినిమాకు రీమేక్ గా తెరకెక్కిస్తున్నారు.ఈ సినిమాలో హీరోయిన్ గా శృతి హాసన్ నటిస్తుంది.
ఈ సినిమాతోపాటు ఆదిపురుష్ సినిమా షూటింగ్ కూడా మొదలు పెట్టాడు.ఈ సినిమాకు ఓం రౌత్ దర్శకత్వం వహిస్తున్నారు.ఆదిపురుష్ సినిమా రామాయణం నేపథ్యంలో తెరకెక్కుతుంది.ఈ సినిమాలో ప్రభాస్ రాముడిగా, కృతి సనన్ సీతగా, సైఫ్ అలీ ఖాన్ రావణాసురిడిగా నటిస్తున్నారు.ప్రస్తుతం ముంబైలోని ఒక ప్రైవేట్ స్టూడియోలో ఆదిపురుష్ షూటింగ్ జరుగుతుంది.
ఈ సినిమాను 3D టెక్నాలజీతో తెరకెక్కిస్తున్నారు.ఈ సినిమాను టి సిరీస్ సంస్థ 500 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తుండగా 60 శాతం బడ్జెట్ గ్రాఫిక్స్ కోసమే ఉపయోగిస్తున్నారని సమాచారం.అయితే ప్రస్తుతం ఈ సినిమాపై లేటెస్ట్ అప్డేట్ వచ్చింది.ఈ సినిమాలో కొన్ని కీలక సన్నివేశాలను తెరకెక్కించడానికి ఒక భారీ అడవి సెట్ ను ఏర్పాటు చేసారు.
ఇప్పుడు ఉన్న కరోనా పరిస్థితుల్లో బయట వెళ్లి షూట్ చేయలేని పరిస్థితి నెలకొంది.అందుకే నిజమైన అడవుల్లో షూటింగ్ చేయలేని పరిస్థితి రావడంతో అందుకే భారీ అడవి సెట్ ఏర్పాటు చేసారు.
ఇది చాలా సహజంగా కనిపించడానికి ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారట.ప్రత్యేక బృందం ఈ సెట్లో ఉంది సరైన ఫుటేజ్ వచ్చేలా షూట్ చేయనుందట.
ఈ సినిమాను వచ్చే సంవత్సరం ఆగస్టు 11 న విడుదల చేయబోతున్నట్టు ప్రకటించారు.