'ఆదిపురుష్' ఫస్ట్ సింగిల్.. ఈ అప్డేట్ ఎప్పుడు రాబోతుందో తెలుసా?

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ క్రేజ్ గురించి స్పెషల్ గా చెప్పాల్సిన పని లేదు.

బాహుబలి సినిమాతో పాన్ ఇండియా వ్యాప్తంగా ఫాలోయింగ్ తెచ్చుకున్న ప్రభాస్ బాలీవుడ్ స్టార్ హీరోలను సైతం రేసులో వెనక్కి నెట్టాడు.

ఇక ఈ మూవీ ఇచ్చిన క్రేజ్ తో ప్రభాస్ ప్రెజెంట్ అన్ని వందల కోట్ల ప్రాజెక్టులను చేస్తూ బిజీగా ఉన్నాడు.మరి ప్రెజెంట్ ప్రభాస్ చేస్తున్న సినిమాల్లో ఆదిపురుష్ ఒకటి.

ఈ సినిమా ప్రకటించినప్పటి నుండి ఎన్నో అంచనాలు ఏర్పడ్డాయి.రామాయణం ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాను బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ తెరకెక్కించాడు.

రామాయణం తెరకెక్కించడం కోసం బాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ టి సిరీస్ సంస్థ దాదాపు 500 కోట్ల పెట్టుబడి పెట్టినట్టు సమాచారం.ఈ సినిమాలో ప్రభాస్ రాముడి నటిస్తుంటే బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ సీతగా నటించింది.

Advertisement

అలాగే సైఫ్ అలీ ఖాన్ రావణాసురిడిగా నటిస్తుండగా.సన్నీ సింగ్ లక్షణుడిగా నటిస్తున్నాడు.ఇలా భారీ తారాగణం ఈ సినిమాలో భాగం కావడంతో ఈ సినిమాపై బాలీవుడ్ లో కూడా భారీ అంచనాలు పెరిగాయి.

మరి అలాంటి సినిమా టీజర్ వచ్చిన తర్వాత ఈ సినిమాపై ఆడియెన్స్ లో నిరాశ బాగా కనిపించింది.ప్రభాస్ ఫ్యాన్స్ సైతం ఓం రౌత్ పై గుర్రుగా ఉన్నారు.

మరి ఆడియెన్స్ నుండి నెగిటివ్ ఫీడ్ బ్యాక్ రావడంతో ఈ సినిమా సంక్రాంతి రిలీజ్ కాస్త జూన్ 16కు వాయిదా పడింది.సినిమా రిలీజ్ వాయిదా వేసిన తర్వాత మళ్ళీ గ్రాఫిక్స్ పనులు మార్చి చేస్తున్నారు.ఇదిలా ఉండగా ఈ సినిమా నుండి ఫస్ట్ సింగిల్ అప్డేట్ గురించి ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ వినిపిస్తుంది.

ఈ సినిమా నుండి ఫస్ట్ సింగిల్ మార్చి చివరిలో రాబోతుంది అని తాజాగా న్యూస్ వైరల్ అయ్యింది.బాలీవుడ్ కంపోజర్స్ అజయ్ అతుల్ అందిస్తున్న ఈ ఫస్ట్ సింగిల్ ఎలా ఉండబోతుందో వేచి చూడాల్సిందే.

మొదటి సినిమాతోనే రికార్డ్ లు బ్రేక్ చేయాలని చూస్తున్న స్టార్ హీరో కొడుకు..?
Advertisement

తాజా వార్తలు