ఆదినారాయణరెడ్డికి షాక్ ఇస్తున్న సోదరులు... వైసీపీలో చేరడానికి సిద్ధం

ఏపీలో రాజకీయాలు ఊహించని విధంగా రోజుకొక మలుపు తీసుకుంటున్నాయి.ఎప్పుడు ఎవరు పార్టీ మారుతారో, ఏ పార్టీలోకి వెళ్తారో తెలియని అయోమయ పరిస్థితి ఉంది.

 Adinarayana Reddy Brothers Join Ysrcp-TeluguStop.com

అధికార పార్టీ వైసీపీ ఇతర పార్టీలలో చేరిన ఎమ్మెల్యేలని తమ పార్టీలో చేర్చుకునే అవకాశం లేదని చెబుతూనే మరోవైపు టీడీపీ, జనసేన ఎమ్మెల్యేలని లోపాయకారిగా ఆ పార్టీలకి వ్యతిరేకంగా మాట్లాడేలా చేస్తుంది.వారిని ఇప్పటికే వల్లభనేని వంశీ టీడీపీ పార్టీ నుండి బయటకి వచ్చాడు.

టీడీపీ సస్పెండ్ చేయడంతో అతను ప్రత్యేక సభ్యుడుగా కొనసాగుతూనే వైసీపీకి మద్దతు ఇస్తున్నాడు.మరో వైపు జనసేన ఎమ్మెల్యే రాపాక అయితే అసెంబ్లీలో పార్టీ వాయిస్ వినిపించకుండా ఏకంగా వైసీపీ సభ్యుడుగానే ప్రవర్తిస్తూ జగన్ పరిపాలన మీద ప్రశంసలు కురిపిస్తున్నాడు.

ఇక ఇదే దారిలో చాలా మందిని వైసీపీ ప్రతిపక్ష పార్టీకి శత్రువులుగా మార్చడానికి వ్యూహం వేసినట్లు టాక్ వినిపిస్తుంది.

ఇదిలా ఉంటే ఇప్పుడు రాయలసీమలో టీడీపీలో ఉన్న జగన్ కమ్యూనిటీకి చెందిన వారందరూ ఆ పార్టీలో చేరిపోతున్నారు.

భయపెట్టి, బెదిరించో, ఒప్పించో వారిని పార్టీలోకి లాగేసుకుంటున్నారు.ఇక జగన్ కి బడ్డ విరోధిగా ఉన్న జమ్మలమడుగు ఆదినారాయణరెడ్డి తనని తాను రక్షించుకోవడానికి టీడీపీని వీడి బీజేపీలో చేరిపోయారు.

దీంతో అతని మీద జగన్ తన దృష్టి మార్చి అతని సోదరుల మీద పెట్టినట్లు తెలుస్తుంది.ఈ నేపధ్యంలో ఆదినారాయణరెడ్డి సోదరులు ఇద్దరు ఈ నెల 23న జగన్ సమక్షంలో వైసీపీలో చేరబోతున్నారని తెలుస్తుంది.

వారితో పాటు టీడీపీ ఎమ్మెల్సీ శివనాధ్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ నారాయణరెడ్డితో పాటు మరికొంత మంది రాయలసీమకి చెందిన టీడీపీ మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వైసీపీలో చేరనున్నట్లు సమాచారం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube