ఆదిలాబాద్ జిల్లాలో పులి కలకలం సృష్టిస్తోంది.భీంపూర్ మండలం వడూర్ శివారులో పులి సంచరిస్తోంది.
భైరవగుట్ట, పెనుగంగా సమీపంలో సంచరిస్తున్న పులిని స్థానికులు చూశారు.ఈ క్రమంలో వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు.
దీంతో రంగంలోకి దిగిన ఫారెస్ట్ అధికారులు పులి పాదముద్రలను గుర్తించే పనిలో పడ్డారు.పులి సంచారం నేపథ్యంలో స్థానిక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.