యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ప్రతిష్టాత్మకంగా పాన్ ఇండియా రేంజ్ లో హిందీలో తెరకెక్కుతున్న సినిమా ఆది పురుష్.మైథలాజికల్ కథాంశంతో తెరకెక్కే ఈ సినిమా ఫస్ట్ ఫుల్ ఇండియన్ గ్రీన్ మ్యాట్ మూవీగా ఆవిష్కరిస్తున్నారు.
పూర్తి త్రీడీ టెక్నాలజీ ఉపయోగించుకొని వెండితెరపై అద్భుతమైన దృశ్యకావ్యంగా దీనిని చూపించేందుకు దర్శకుడు ఓం రౌత్ రెడీ అవుతున్నాడు.ఏకంగా 250కోట్ల భారీ బడ్జెట్ తో టి-సిరీస్ ఈ సినిమాని నిర్మిస్తుంది.
ఇక ఇందులో ప్రభాస్ శ్రీరాముడు పాత్రలో కనిపించనుండగా, సైఫ్ అలీఖాన్ లంకేశ్ రావణ్ పాత్రలో కనిపించబోతున్నాడు.ఇక ఈ రెండు పాత్రల మధ్య సంఘర్షణతో కూడిన కథాంశం అయినా రామాయణం ఎలా కథ గురించి అందరికి తెలిసిందే.
ఈ కథలోని ఒక ప్రధాన ఎలిమెంట్ ని తీసుకొని ఆది పురుష్ సిద్ధం చేసినట్లు తెలుస్తుంది.ఇదిలా ఉంటే ఈ సినిమాలో సీత పాత్రలో ఎవరు కనిపిస్తారనే దానిపై చిత్ర యూనిట్ ఇంకా ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు.
అయితే ఇప్పుడు ఓం రౌత్ టీం ఈ సినిమా షూటింగ్ కి ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది.రాధేశ్యామ్ షూటింగ్ ముగింపు దశకి వచ్చేసింది.ఈ నేపధ్యంలో ఆది పురుష్ సినిమా కోసం ప్రభాస్ ఫిబ్రవరిలో డేట్స్ కేటాయించారు.ఏకంగా మూడు నెలలు ఈ సినిమా కోసం వర్క్ చేయబోతున్నాడు.
ఈ నేపధ్యంలో ప్రభాస్ డేట్స్ ని దృష్టిలో ఉంచుకొని జనవరి 19 నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేయాలని అనుకుంటున్నట్లు తెలుస్తుంది.దీనిపై ఇప్పటి వరకు అఫీషియల్ ప్రకటన రాకున్న దర్శకుడు ఓం రౌత్ షెడ్యూల్ ఖరారు చేసినట్లు తెలుస్తుంది.
.