ప్రస్తుతం దేశంలో అత్యంత క్రేజీ ప్రాజెక్ట్ లలో రాజమౌళి ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్ 2 తో పాటు డార్లింగ్ ప్రభాస్ బాలీవుడ్ లో ఓం రౌత్ దర్శకత్వంలో పాన్ ఇండియా రేంజ్ లో చేస్తున్న ఆది పురుష్ కూడా ఉంది.ఓం రౌత్, ప్రభాస్ కాంబినేషన్ లో ఆది పురుష్ సినిమా ఎనౌన్స్ చేయగానే ఒక్కసారిగా ఈ సినిమా సోషల్ మీడియాలో సెన్షేషన్ గా మారిపోయింది.
ఈ సినిమా మాటున ప్రభాస్-నాగ్ అశ్విన్ కాంబినేషన్ లో తెరకెక్కబోయే భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ కూడా మరుగున పడిపోయింది.ఆది పురుష్ మీద ఇంత క్రేజ్ రావడానికి కారణం ప్రభాస్ బాలీవుడ్ లో చేస్తున్న మొదటి సినిమా కావడం ఒకటైతే.
రామాయణం ఇతివృత్తంగా ఈ సినిమాని విజువల్ వండర్ గా త్రీడీ టెక్నాలజీలో ఆవిష్కరించబోతుండటం మరో విషయం.ఇక ఈ సినిమా లంకేశ్ రావణ్ పాత్రలో ప్రతినాయకుడుగా సైఫ్ అలీఖాన్ ఇప్పటికే కన్ఫర్మ్ అయ్యారు.
సీత పాత్ర కోసం వేట సాగుతుంది.
ఇదిలా ఉంటే దర్శకుడు ఓం రౌత్ ఈ సినిమా గురించి తాజాగా మరికొన్ని ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు.
లాక్డౌన్ సమయంలో కాలేజీలో ఉన్నప్పట్నుంచీ అనుకుంటున్న ఆదిపురుష్ కథ గురించి మరోసారి ఆలోచించా.గతంలో రాసుకున్న కథని బయటికి తీసి దానిపై కొంత వర్క్ చేసి ప్రభాస్కి ఫోనులో కథ వివరించాను.
నేను చెప్పిన ఎలిమెంట్ ఆయనకి కనెక్ట్ కావడంతో అన్లాక్ దశ రాగానే హైదరాబాద్ వెళ్లి పూర్తిగా కథ నేరేషన్ ఇచ్చానని ఓం రౌత్ చెప్పుకొచ్చారు.వచ్చే జనవరిలో ఆదిపురుష్ చిత్రీకరణ ప్రారంభిస్తామని ఈ సందర్భంగా స్పష్టం చేశాడు.
త్వరలో సినిమా గురించి మరిన్ని అప్డేట్స్ ఉంటాయని ఈ సందర్భంగా క్లారిటీ ఇచ్చారు.మరి ఆది పురుష్ జనవరిలో స్టార్ట్ అయితే నాగ్ అశ్విన్ ప్రాజెక్ట్ ని ప్రభాస్ ఎప్పుడు సెట్స్ పైకి తీసుకొని వెళ్తాడు అనేది వేచి చూడాలి.