యంగ్ హీరో సాయిధరమ్ తేజ్ శుక్రవారం రోజున రోడ్డు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే.సాయితేజ్ ను కాపాడిన వ్యక్తులు అబ్దుల్ ఫర్హాన్, అసిఫ్ కాగా రామ్ చరణ్ వీళ్లకు గిఫ్ట్ ఇచ్చినట్టు సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది.
అయితే జరుగుతున్న ప్రచారం గురించి మహ్మద్ ఫర్హాన్ స్పందిస్తూ ఆసక్తికర విషయాలను వెల్లడించారు.చరణ్ తనకు కారును బహుమతిగా ఇచ్చినట్టు జరిగిన ప్రచారంలో వాస్తవం లేదని ఫర్హాన్ పేర్కొన్నారు.
తన గురించి తప్పుగా జరుగుతున్న ప్రచారంపై పోలీసులకు ఫిర్యాదు చేశానని ఫర్హాన్ వెల్లడించారు.మెగా ఫ్యామిలీ తనకు డబ్బులు ఇచ్చారని వస్తున్న వార్తలు కూడా నిజం కాదని ఆ వార్తలను ఎవరూ నమ్మవద్దని ఫర్హాన్ కోరారు.
యూట్యూబ్ లో చాలామంది ఫేక్ వీడియోలు పెడుతున్నారని నేను మానవత్వంతో సహాయం చేశానని అందరూ ఎవరికైనా ప్రమాదం జరిగితే అదే విధంగా సహాయం చేయాలని కోరుకుంటున్నానని ఫర్హాన్ చెప్పుకొచ్చారు.
తన గురించి తప్పుగా వీడియోలు పెట్టడం వల్ల సమస్యలు వస్తున్నాయని ఫర్హాన్ తెలిపారు.
మరోవైపు సాయిధరమ్ తేజ్ కు అపోలో ఆస్పత్రిలో చికిత్స కొనసాగుతోంది.వైద్యులు సాయిధరమ్ తేజ్ దగ్గరకు ఎవరినీ అనుమతించడం లేదని తెలుస్తోంది.ప్రస్తుతం సాయితేజ్ ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు చెబుతున్నారు.సాయితేజ్ త్వరగా కోలుకోవాలని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు.
వచ్చే నెల 1వ తేదీన సాయితేజ్ నటించిన రిపబ్లిక్ సినిమా రిలీజ్ కానుంది.యూత్ లో భారీస్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోలలో సాయితేజ్ ఒకరు.ప్రతిరోజూ పండగే సినిమాతో భారీ హిట్ కొట్టిన సాయితేజ్ మరిన్ని సక్సెస్ లను ఖాతాలో వేసుకుంటారని ఫ్యాన్స్ భావిస్తున్నారు.ప్రమాదం తర్వాత ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అధికారులు సైతం తగిన చర్యలు తీసుకుంటూ ఉండటం గమనార్హం.