క్షణం, ఎవరు వంటి సస్పెన్స్ థ్రిల్లర్ పాత్రలలో నటించి ఎంతగానో అందరినీ ఆకట్టుకున్న అడవిశేషు ప్రస్తుతం మేజర్ సినిమాలో నటిస్తున్నారు.ఉగ్రవాదుల దాడులలో వీరమరణం పొందిన మేజర్ ఉన్నికృష్ణన్ జీవిత ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో అడవి శేషు ఉన్నికృష్ణన్ పాత్రలో నటిస్తున్నారు.
ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్ పోస్టర్ విడుదల కావడంతో ఈ సినిమాపై అంచనాలు పెంచాయి.తాజాగా అడవి శేషు వీర్ సాగర్, శ్రీ రాపాక ప్రధాన పాత్రలో, వీర్ సాగర్ దర్శకత్వంలో హ్రరర్ చిత్రం మరణంసినిమా తెరకెక్కుతోంది.
ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను అడవిశేషు విడుదల చేశారు.ఈ సందర్భంగా ఈ హీరో మాట్లాడుతూ.
మరణం పోస్టర్ ఎంతో బాగుందని, చూడగానే భయపడే విధంగా ఉందని తెలియజేశారు.అంతేకాకుండా తనకు హర్రర్ సినిమాలు అంటే చాలా భయం అని తెలియజేశారు.చాలా మందికి ఇలాంటి సినిమాలు చూడటానికి ఎంతో భయపడుతుంటారు.కానీ ఎంతో ఆసక్తికరంగ కొనసాగే ఈ సినిమాలను చూడటానికి చాలా మంది ఇష్టపడతారని ఈ సందర్భంగా అడవిశేషు తెలిపారు.
కానీ మరణం సినిమా పోస్టర్ చాలా ఆసక్తికరంగా ఉందని తప్పకుండా ఈ సినిమా విజయం సాధిస్తుందని ఈ సందర్భంగా అడవి శేషు తెలియజేశారు.
మరణం పోస్టర్ విడుదల కార్యక్రమంలో ఈ చిత్ర దర్శకులు మాట్లాడుతూ.
మా సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ అడవి శేషు విడుదల చేయడం ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు.అదే విధంగా నన్ను నా కథను నమ్మి ఈ సినిమాను నిర్మించడానికి ముందుకొచ్చిన రేణుకా గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.
వీర్ సాగర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్ మరణం సినిమాను ఓషియన్ ఫిల్మ్స్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై తెరకెక్కిస్తున్నారు.ఈ సినిమా పోస్టర్ ఎంతో ఆసక్తికరంగా మరి అందరిని ఆకట్టుకుంటుంది.