గూడచారి లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత అడవి శేష్ హీరోగా మరో ఇంటరెస్టింగ్ కథతో ప్రేక్షకుల ముందుకి రాబోతున్నాడు.శశికిరణ్ తిక్కా దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది.
ఇండియాలో ముంబాయ్ ఉగ్రదాడిలో టెర్రరిస్ట్ లతో వీరోచితంగా పోరాడిన మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ అనే ఆర్మీ ఆఫీసర్ నిజ జీవిత కథతో ఈ సినిమా తెరకెక్కుతున్నట్లు తెలుస్తుంది.తాజాగా ఈ సినిమాకి సంబంధించిన పోస్టర్ ని చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది.
ఇదిలా వుంటే మొదటి సారి ఈ సినిమాతో సోనీ పిక్చర్స్ సంస్థ టాలీవుడ్ లో నిర్మాణ రంగంలోకి అడుగు పెడుతుంది.ఇక ఇందులో హీరో అడవి శేష్ టైటిల్ రోల్ పోషిస్తూ వున్నాడు.
ఇక ఈ సినిమాని తెలుగు, హిందీ భాషలలో ఏక కాలంలో తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తుంది.అయితే అడవి శేష్ ఈ సినిమా గూడచారి సీక్వెల్ లో భాగంగా తీసుకోస్తున్నాడా, లేక సపరేట్ సినిమాగా వస్తుందా అనేది వేచి చూడాలి.
ఏది ఏమైనా మరోసారి అడవి శేష్ ప్రేక్షకుల ముందుకి మరో ఇంటరెస్టింగ్ పాయింట్ తో వస్తున్నాడని తాజాగా ఈ సినిమా పోస్టర్ బట్టి అర్ధమవుతుంది.