రామ్ తేజ, రేఖ ఇందుకూరి హీరోహీరోయిన్లుగా నటిస్తున్న తాజా చిత్రం అడవి దొంగ.ఈ సినిమా ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతోంది.
ఈ సినిమాకు కిరణ్ కోటప్రోలు దర్శకత్వం వహించగా నిర్మాతగా భోగి కృష్ణ వ్యవహరిస్తున్నారు.ప్రముఖ దర్శకుడు వీరశంకర్ నిర్మాత ఆరా మస్తాన్ లు ఈ ట్రైలర్ ని విడుదల చేశారు.
అనంతరం చిత్ర యూనిట్ కి శుభాకాంక్షలు తెలిపారు.
ట్రైలర్ చాలా బాగుందని, కచ్చితంగా ఈ సినిమా మంచి విజయం సాధించాలని ఆశిస్తున్నాం అంటూ వారు తెలిపారు.
ఈ నేపథ్యంలోనే దర్శకుడు కిరణ్ కోటప్రోలు మాట్లాడుతూ అడవి దొంగ ట్రైలర్ విడుదల చేసి శుభాకాంక్షలు తెలిపిన పెద్దలు అందరికీ ధన్యవాదాలు అని తెలిపారు.అడవి ప్రాంతంలో ఎర్రచందనం నేపథ్యంలో,ఈ సినిమా ఉంటుంది.
అన్ని కమర్షియల్ హంగులతో రియాలిటీకి దగ్గరగా ఈ సినిమాను రూపొందించడం జరిగింది అని తెలిపారు.
ఈ సినిమా కోసం ప్రతి ఒక్కరు కూడా కష్టపడి పని చేశారు అందరికీ ధన్యవాదాలు అని తెలిపారు.అనంతరం హీరో రామ్ తేజ మాట్లాడుతూ ఒకానొక దశలో షూట్ లో నా కాలు విరిగిపోయింది.అయినప్పటికీ డైరెక్టర్ నాతో పని చేయించాడు.
ఆయన పని రాక్షసుడు.ఆయన అలా ఉన్నాడు కాబట్టి సినిమా చాలా రిచ్ గా వచ్చింది ఈ సినిమాలో చేసిన అందరికీ మంచి పేరు వస్తుంది.
అంతే కాకుండా ఈ సినిమా చేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను అని తెలిపారు.