శర్వానంద్, రష్మిక జంటగా కిశోర్ తిరుమల డైరక్షన్ లో వచ్చిన సినిమా ఆడవాళ్లు మీకు జోహార్లు.టీజర్, ట్రైలర్ తో ఆసక్తి కలిగించిన ఈ సినిమా ఫ్యామిలీ ఎమోషన్స్ తో ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
సినిమా ప్రీమియర్స్ ఆల్రెడీ పడగా సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చింది.సినిమాలో కావాల్సినంత ఎమోషన్, ఎంటర్టైనింగ్ ఉందని చెబుతున్నారు.
శర్వానంద్ తన కామెడీ టైమింగ్ తో మెప్పించాడట.ఇక సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్ గా రష్మిక నిలిచిందని అంటున్నారు.ఆమె లుక్స్, గ్రేస్ అంతా సినిమాని నెక్స్ట్ లెవల్ కి తీసుకెళ్లిందని చెబుతున్నారు.రష్మిక కనిపించిన ప్రతిసారి ఆడియెన్స్ విజిల్స్ వేస్తున్నారట.
దేవి మ్యూజిక్ కూడా సినిమాకు ప్లస్ అయ్యిందని టాక్.సినిమాలో అలనాటి మేటి తారలు రాధిక, ఖుష్బు, ఊర్వశి లాంటి వారు నటించారు.
వారు కూడా సినిమాకు మెయిన్ హైలెట్ గా చెప్పుకుంటున్నారు.ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమా ఓవరాల్ గా పాజిటివ్ టాక్ తెచ్చుకుందని తెలుస్తుంది.
అయితే సినిమాలో ఎమోషనల్ పాళ్లు ఎక్కువే అని కొందరు చెబుతున్నారు.టీవీ సీరియల్ లాగా మెలోడ్రామా బాగా ఎక్కువైందని కొందరంటున్న మాట.