కడప జిల్లాలో విషాదం.. ఆత్మహత్య చేసుకున్న తల్లి కూతురు.. !

లోకంలో అన్ని సమస్యలకు మందు ఒక్క మరణం అని భావిస్తున్నారు నేటి కాలపు మనషులు.జీవితంలో ఎదురురయ్యే ఒడిదుడుకులను వివేకంతో జయించుకోలేక మానసిక వేదనకు లోనై వారితో పాటు కన్న పిల్లల ప్రాణాలు కూడా తీస్తున్నారు.

 Kadapa District Mother Commits Suicide With Daughter,kadapa District, Mother, Da-TeluguStop.com

ఇలాంటి సంఘటనలు నిత్యం ఎక్కడో ఒక్కచోట జరుగుతున్నాయి.ఇకపోతే తాజాగా కడప జిల్లాలో కూడా ఇలాంటి విషాదమే చోటు చేసుకుంది.ఆ వివరాలు చూస్తే.కడపకు చెందిన శ్రావణి(29)కి, తొమ్మిదేళ్ల క్రితం శివకుమార్‌ రెడ్డితో వివాహమైంది.

కాగా వీరికి ఎనిమిదేళ్ల కుమార్తె తన్విక ఉంది.ఇక శివకుమార్‌ రెడ్డి ప్రస్తుతం అమెరికాలో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేస్తుండగా, శ్రావణి తన కుమార్తె తన్విక(8)తో కలిసి శంకరాపురంలో నివాసం ఉంటోంది.

ఈ క్రమంలో ఈ రోజు ఉదయం శ్రావణి తన కుమార్తెతో కలిసి పడక గదిలో ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది.

Telugu Kadapa, Mother-Latest News - Telugu

ఈ విషయం తెలుసుకున్న స్దానికులు పోలీసులకు సమాచారం అందించారట.ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం రిమ్స్‌ ఆస్పత్రికి తరలించారు.ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు సీఐ అశోక్‌ రెడ్డి తెలిపారు.

కాగా గత ఐదేళ్లుగా భార్యాభర్తల మధ్య మనస్పర్థలు ఉన్నాయన్న సమాచారం.కాగా శ్రావణి ఆత్మహత్యకు ఇంకా మరేవైనా కారణాలు ఉన్నాయా అని పోలీసులు ఆరా తీస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube