లాక్ డౌన్ తర్వాత కరోనా శరవేగంగా విస్తరించిన కూడా సినిమా షూటింగ్ లకి ప్రభుత్వాలు పర్మిషన్ ఇచ్చాయి.దీంతో చాలా మంది ఇప్పటికే సినిమా షూటింగ్ లు మొదలు పెట్టారు.
అలాగే సీరియల్స్, యాడ్ షూట్ లు కూడా మొదలయ్యాయి.అయితే నటీనటులు ఒకప్పటిలా ఇప్పుడు షూటింగ్ లకి ధైర్యంగా వెళ్ళలేకపోతున్నారు.
కరోనా భయంతో వారు తప్పనిసరి పరిస్థితిలో భయంభయంగా షూటింగ్ కి వెళ్తున్నారు.అక్కడికి వస్తున్నవారిలో ఎవరికైనా కరోనా ఉంటే పరిస్థితి ఏంటి అని భయపడుతున్నారు.
ఈ భయానికి తగ్గట్లే తాజాగా ఓ తెలుగు సీరియల్ షూటింగ్ లో నటుడుకి కరోనా రావడంతో షూటింగ్ మళ్ళీ నిలిపెయాల్సి వచ్చింది.
ఇదిలా ఉంటే లాక్ డౌన్ తర్వాత ఆదాశర్మ ఓ యాడ్ షూటింగ్ కి రెడీ అయ్యింది.
ఈ నేపధ్యంలో షూటింగ్ కోసం సెట్లోకి వెళ్తుంటే యుద్ధభూమిలోకి వెళ్తున్న భావన కలుగుతోంది ఈ అమ్మడు చెబుతుంది.దీనిపై ట్విట్టర్ లో పోస్ట్ పెట్టింది.బ్యాక్ టు సెట్.లాక్డౌన్ ఎత్తేసిన తర్వాత నేను తొలిసారి సెట్లోకి అడుగుపెట్టాను.
ఓ వాణిజ్య ప్రకటన కోసం ఒక్కరోజు షూటింగ్ చేయాలి.సెట్లో ఇరవైమంది మాత్రమే ఉన్నారు.
అందరూ మాస్క్లు ధరించారు.శానిటైజ్ అయ్యారు.
ఇలా అన్ని జాగ్రత్తలు తీసుకుని సెట్లోకి అడుగుపెడుతుంటే యుద్ధభూమిలోకి వెళ్తున్నట్లు ఉంది.లాక్డౌన్ తర్వాత షూటింగ్కు వెళ్తున్న అతికొద్ది నటీనటుల జాబితాలో నా పేరు కూడా ఉంటుందనుకుంటున్నాను అని అదా శర్మ చెప్పుకొచ్చింది.
మొత్తానికి ఈ ఫీలింగ్ కేవలం ఆదాకి మాత్రమే కాకుండా ఇంచుమించు నటులందరికీ ఉందనే చెప్పాలి.