నార్త్ అమెరికా తెలుగు సంఘం నాట్స్ ఆధ్వర్యంలో ఇర్వింగ్ లో మే 24 నుంచీ 26 వరకూ తెలుగు సంబరాలు జరగనున్నాయనే విషయం అమెరికాలోని తెలుగు ప్రజలకి అందరికి తెలిసిందే అయితే.ఈ వేడుకల కోసం నాట్స్ అడ్హాక్ కమిటీని ఏర్పాటు చేసింది.
ఈ కమిటీకి చైర్మన్గా శ్రీనివాస్ గుత్తికొండ నియమించబడ్డారు.శ్రీధర్ అప్పసాని వైస్ చైర్మన్గా ఉండగా, శ్రీనివాస్ మంచికలపూడి (ప్రెసిడెంట్), కిషోర్ కంచర్ల (కాన్ఫరెన్స్ చైర్మన్), శ్రీనివాస్ మద్దాళి (మాజీ చైర్మన్), మోహన్ కృష్ణ మన్నవ (మాజీ చైర్మన్).
గా ఉన్నారు.
ఇక మధు కొర్రపాటి (మాజీ చైర్మన్), మధు బోదపాటి (డైరెక్టర్), ప్రశాంత్ పిన్నమనేని (డైరెక్టర్), రాజేంద్ర మాదాల (కాన్ఫరెన్స్ సెక్రటరీ), శ్రీనివాసరావు కొడాలి (డైరెక్టర్), శ్రీరామచంద్రమూర్తి బడిగ (డైరెక్టర్), వంశీమోహన్ గరికపాటి (వైస్ ప్రెసిడెంట్) వారందరూ ఈ కమిటీలు ఉన్నారు.
ఈ సంబరాలు సజావుగా ఎటువంటి ఆటంకం లేకుండా చేయడానికి ఈ కమిటీని వేసినట్టుగా కమిటీ అధ్యక్షులు తెలిపారు.