హీరోయిన్గా ప్రయత్నించిన తెలుగమ్మాయి మాధవిలత సక్సెస్లు రాకపోవడం, ఆ పై ఛాన్స్లు లేకపోవడంతో మెల్ల మెల్లగా ఇండస్ట్రీకి దూరం అయ్యింది.తెలుగు సినిమా పరిశ్రమలో తెలుగు అమ్మాయిలు నెగ్గుకు రావడం కష్టం అని ఈ అమ్మాయి ద్వారా కూడా వెళ్లడయ్యింది.
ఇక మాధవిలత ప్రస్తుతం బీజేపీ నాయకురాలుగా ఉంది.ఈమె అప్పుడప్పుడు పవన్ కళ్యాణ్ గురించి పెట్టే పోస్ట్లు, చేసే వ్యాఖ్యలు అందరిని ఆశ్చర్యపర్చుతూ ఉంటాయి.తాజాగా ఈమె మరో ఆసక్తికర పోస్ట్ పెట్టింది.2000వ సంవత్సరంలో తాను పవన్ కళ్యాణ్ గురించి రాసుకున్న కవితను పోస్ట్ చేసింది.
అప్పట్లో తనకు పవన్ పై ఉన్న ఆరాధన భావంను ఈ లేఖ రూపంలో రాసింది.తనలోని కవిని నిద్రలేపి మరీ ఈ లెటర్ను ఆమె రాసినట్లుగా అనిపిస్తుంది.
ఆమె ఆ సమయంలో పవన్ను ఎంతగా ఆరాధించిందో లేఖను చూస్తే అర్థం అవుతోంది.పవన్ను చూసిన సమయంలో నాకు ఒక పక్క సంతోషం మరో పక్క బాధ అంటూ ఒక విరహ వేదనతో కూడిన భగ్న ప్రేమికురాలు రాసినట్లుగా ఈ లేఖను రాసింది.
కింద పోస్ట్లో మాధవిలత స్వయంగా లేఖను చూడవచ్చు.