టాలీవుడ్ ఇండస్ట్రీలోని ప్రముఖ నటీమణులలో రాజశ్రీ నాయర్ కూడా ఒకరు.తాజాగా రాజశ్రీ నాయర్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ దమ్ము సినిమాలో తాను రెండు డైలాగ్స్ చెప్పానని అయితే ఆ రెండు డైలాగ్స్ ను కూడా ఎడిటింగ్ లో తీసేశారని చెప్పుకొచ్చారు.
ఎడిటింగ్ లో నటించిన సీన్లను తొలగించడం సాధారణంగా జరుగుతుందని రాజశ్రీ పేర్కొన్నారు.నటిగా తాను సినిమాలో చేసినందుకు రెమ్యునరేషన్ వస్తుందని రాజశ్రీ చెప్పుకొచ్చారు.
రెండున్నర గంటల సినిమా కోసం ఎక్కువ మొత్తం షూట్ చేస్తారని మూవీ రిలీజయ్యే వరకు మనం నటించింది ఉంటుందో లేదో చెప్పలేమని రాజశ్రీ పేర్కొన్నారు.కొన్ని సినిమాలలో తన పాత్రలు క్లిక్ కాలేదని రాజశ్రీ నాయర్ పేర్కొన్నారు.
శ్రీమంతుడు సినిమా తనకు మంచి గుర్తింపును తెచ్చిపెట్టిందని ఆమె అన్నారు.మజిలీ సినిమాలో చైతన్య సమంతలతో కలిసి పని చేశానని రాజశ్రీ నాయర్ అన్నారు.
మజిలీ షూటింగ్ సమయానికి వాళ్లిద్దరికీ రీసెంట్ గా మ్యారేజ్ అయిందని రాజశ్రీ నాయర్ చెప్పుకొచ్చారు.
నాగచైతన్యతో బంగార్రాజు సినిమా కూడా తాను చేస్తున్నానని స్వీట్ హార్ట్ ఉన్న వ్యక్తి నాగచైతన్య అని రాజశ్రీ నాయర్ అన్నారు.నాగచైతన్య డౌన్ టు ఎర్త్ ఉంటారని రాజశ్రీ నాయర్ వెల్లడించారు.మజిలీ సమయంలో ఇద్దరూ కలిసి పని చేయడం సంతోషంగా అనిపించిందని ఆ సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయని రాజశ్రీ నాయర్ చెప్పుకొచ్చారు.
విడాకుల వార్త విని తాను చాలా ఫీల్ అయ్యానని రాజశ్రీ నాయర్ వెల్లడించారు.హీరో నాని గురించి మాట్లాడుతూ నాని ఎప్పుడూ తను నటించే సీన్ల గురించి ఆలోచిస్తాడని ఆ సీన్లను ఇంప్రూవ్ చేయడం గురించి ఆలోచిస్తానని రాజశ్రీ నాయర్ చెప్పుకొచ్చారు.రాజశ్రీ నాయర్ కు తెలుగులో వరుసగా సినిమా ఆఫర్లు వస్తున్నాయి.అయితే ఈమెకు నటిగా ఆశించిన స్థాయిలో గుర్తింపు రాలేదు.తెలుగులో అమ్మ పాత్రల్లో రాజశ్రీ ఎక్కువగా నటిస్తున్నారు.