ఈ మధ్య కాలంలో ఏదైనా పెద్ద పండుగ వస్తుందంటే చాలు టీవీ ఛానెళ్లు ఈవెంట్లను నిర్వహిస్తూ ప్రేక్షకులను ఆకర్షించాలని ప్రయత్నిస్తున్నాయి.ఒకప్పుడు ఈటీవీ ఛానెళ్లలో మాత్రమే ఈవెంట్లు ఎక్కువగా జరిగేవి.
తరువాత కాలంలో స్టార్ మా, జీ తెలుగు ఈ తరహా ప్రోగ్రామ్ లకు ప్రాధాన్యతనిస్తున్నాయి.ఈ ఈవెంట్లు మంచి టీఆర్పీ రేటింగ్ లను సొంతం చేసుకోవడంతో పాటు రీ టెలీకాస్ట్ కు కూడా అవకాశం ఉండటంతో వీటికి ప్రాధాన్యత పెరిగింది.
ఈ ఈవెంట్లపై ప్రేక్షకులకు అంచనా పెంచడం కోసం టీవీ ఛానెళ్లు అదిరిపోయే ప్రోమోలను విడుదల చేస్తూ క్యూరియాసిటీని పెంచుతున్నాయి.అక్టోబర్ 25వ తేదీన దసరా పండుగ సందర్భంగా జీ తెలుగు ఛానల్ శ్రీముఖి ప్రదీప్ పెళ్లి అంటూ ఈవెంట్ కండక్ట్ చేస్తోంది.
గతంలో రష్మీ సుధీర్ పెళ్లి అంటూ ఒక ఈవెంట్ జరగగా జీ తెలుగు కూడా శ్రీముఖి ప్రదీప్ తో అలాంటి ఈవెంట్ నే ప్లాన్ చేయడం గమనార్హం.
ఈ ఈవెంట్ కు సంబంధించి తాజాగా ఒక ప్రోమో విడుదలైంది.
ఈ ప్రోమోలో బతుకు జట్కా బండి, రచ్చబండ, సంసారం ఒక చదరంగం ప్రోగ్రామ్ లలా ఒక స్కిట్ ను ప్లాన్ చేశారు.నాగబాబు కూతురు నిహారిక జడ్జి స్థానంలో ప్రదీప్, శ్రీముఖి భార్యాభర్తల్లా ప్రోమోలో కనిపించారు.
నిహారిక ప్రదీప్ ను నీ సమస్య ఏంటి అని అడగగా ఆ లెటర్ లో ఏముందో చెప్పాలని ప్రదీప్ అడుగుతాడు.నిహారిక వెంటనే బుద్ధి లేదా.? అంటూ ప్రదీప్ పై సీరియస్ అవుతుంది.
వెంటనే ప్రదీప్ మీకు నా గురించి తెలియట్లేదు ప్రదీప్ మాచిరాజు అని చెప్పగా మా అన్న రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు అయితే ఏంటి.? అంటూ నిహారిక కౌంటర్ వేస్తుంది.శ్రీముఖి పకపకా నవ్వగా ప్రదీప్ నవ్వాపుకుంటున్నావు కదా నువ్వు.? అంటాడు.మొత్తానికి దసరా పండుగ సందర్భంగా ప్రసారమయ్యే ఈవెంట్లు ప్రేక్షకులకు ఫుల్ గా ఎంటర్టైన్మెంట్ అందిస్తాయనడంలో ఎలాంటి సంధేహం అవసరం లేదు.