ప్రస్తుతం ఫోన్ లేనిదే ఎవరు లేరు.ప్రతి ఒక్కరి దగ్గర స్మార్ట్ ఫోన్ లు సోషల్ మీడియా అకౌంట్లు.
ప్రతి ఒక్కరిని స్మార్ట్ ఫోన్ దగ్గరికి చేసుకుంది.నిజానికి చాలా మందికి స్మార్ట్ ఫోన్ ఒక వ్యసనం అయ్యింది.
ముఖ్యంగా సోషల్ మీడియాలో మునిగితేలుతున్నారు.చిన్న, పెద్ద,వయస్సు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ సోషల్ మీడియా కి అలవాటు పడిపోయారు.
సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా సినీ స్టార్సే కాకుండా సామాన్య ప్రజలు కూడా బాగా అలవాటు పడిపోయారు.ప్రతి ఒక్క విషయాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకుంటారు.అంతేకాకుండా ఇతరులతో గడపకుండా చేస్తుంది సోషల్ మీడియా.నిజానికి పక్కనున్న వ్యక్తినే చూసేంత సమయం లేకుండా ఫోన్ లో గడుపుతుంటారు.ఇదిలా ఉంటే ఓ నటి సోషల్ మీడియా ద్వారా టైం వేస్ట్ అంటూ కొన్ని సంచలన వ్యాఖ్యలు చేసింది.
ప్రస్తుతం నటీనటుల వేదిక సోషల్ మీడియానే తమకున్న అభిమానుల కోసం సోషల్ మీడియాలో తెగ మునిగిపోతారు.
సినిమాకు సంబంధించిన, తమకు సంబంధించిన ఫోటోలను, వీడియోలను ఎప్పటికప్పుడు అభిమానులకు పంచుకుంటారు.ఇక సోషల్ మీడియా గురించి ద మోస్ట్ హాలీవుడ్ నటీమణి నోట నుండి వినిపించిన విషయం ఇది.అమెరికన్- కెనడియన్ అయిన హాలీవుడ్ నటి పమేలా ఆండర్సన్.తాజాగా తన సోషల్ మీడియా నుంచి గుడ్ బై చెబుతూ చివరిగా ఓ ఫోటోను పోస్ట్ చేసింది.
సోషల్ మీడియా తన జీవితంపై అత్యంత ప్రభావాన్ని చూపిస్తుందట.అంతేకాకుండా తన మనసుని రిమోట్ కంట్రోల్ లా మార్చిందట.అందుకనే అతను ట్విట్టర్, ఇన్ స్టాగ్రామ్ లకు చివరి ఫోటో అంటూ తన ఫోటోని పెట్టి గుడ్ బై చెప్పింది.ఇక తన సమయం మొత్తం సంపాదన కోసమే ఉపయోగిస్తానని తెలిపింది.