తెలుగు, తమిళ సినిమాలలో లేడీ కమెడియన్ గా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్న నటి విద్యుల్లేఖ రామన్.ఈమె తండ్రి కూడా కోలీవుడ్ ఫేమస్ యాక్టర్.
తండ్రి బాటలోనే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన విద్యుల్లేఖ చాలా తక్కువ టైంలోనే తనదైన పెర్ఫార్మెన్స్ తో ఇరగదీస్తూ టాప్ కమెడియన్ అయిపొయింది.మొదట్లో హీరోయిన్ ఫ్రెండ్ పాత్రలలో అలరించిన తరువాత ఆమె కోసం ప్రత్యేకంగా పాత్రలు క్రియేట్ చేసుకునే స్థాయికి చేరుకుంది.
తెలుగులో సరైనోడులో ఆమె పండించిన సాంబార్ కామెడీ మంచి క్లిక్ అయ్యింది.అలాగే రాజుగాది గది సినిమాలో కూడా విద్యుల్లేఖ మంచి గుర్తింపు తెచ్చుకుంది.
తెలుగు, తమిళ భాషలలో చాలా సినిమాలు చేసిన ఈ భామ ఈ మధ్య ఫిట్ నెస్ విషయంలో ఎక్కువ శ్రద్ధ తీసుకొని కాస్తా స్లిమ్ అయిపోయింది.ఇదే సమయంలో తాను ప్రేమించిన వ్యక్తితో పెళ్లికి రెడీ అవుతుంది.
నాలుగు రోజుల క్రితం నిశ్చితార్ధం కూడా జరిగిపోయింది. ఫిట్నెస్ ట్రైనర్, న్యూట్రిషనిస్ట్ అయిన సంజయ్ తో ఆమె నిశ్చితార్ధ కార్యక్రమం జరిగింది.
వీరు గత కొంత కాలంగా ప్రేమలో ఉన్నట్లు సమాచారం.చెన్నైలో ఆగస్టు 26న ఈ వేడుక జరుగగా కేవలం మిత్రులు, కుటుంబ సభ్యులు మాత్రమే హాజరయ్యారు.
తన నిశ్చితార్ధం అయిన విషయాన్ని విద్యుల్లేఖ సోషల్ మీడియా ద్వారా కన్ఫర్మ్ చేసింది.కరోనా వైరస్ నేపథ్యంలో ప్రభుత్వ నిబంధలను అనుసరించి తమ నిశ్చితార్ధ కార్యక్రమం జరిగిందని ఆమె సోషల్ మీడియాలో పంచుకున్నారు.
అలాగే సంజయ్ తో ఆమె దిగిన ఫోటోలను కూడా పోస్ట్ చేయడం జరిగింది.మరో రెండు నెలల్లో ఆమె పెళ్లి పీటలు ఎక్కనున్నట్లు తెలుస్తుంది.