ఈ మధ్యకాలంలో హీరోయిన్లు సోషల్ మీడియాలో బాడీ షేమింగ్ కామెంట్స్ ఎదుర్కొంటున్నారు.సోషల్ మీడియాలో ప్రభావం ఎక్కువైనా తర్వాత సెలబ్రెటీలు ఎప్పటికప్పుడు తమ గురించి సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటూ ఉంటారు.
అయితే నెటిజన్లు మాత్రం హీరోయిన్ ఏ పరిస్థితిలో ఉన్న అందంగా, స్లిమ్ గా ఉండాలని ఆశపడుతూ ఉంటారు.ఒక వేళ వారి కంటికి కాస్తా లావుగా కనిపించిన, లేదంటే కాస్ట్యూమ్స్ విషయంలో తేడాగా కనిపించిన వెంటనే వ్యక్తిత్వ్మ్ హననం చేసే విధంగా కామెంట్స్ చేస్తారు.
వారి బాడీపై విపరీతంగా జోకులు వేస్తూ ట్రోల్ ఉంటారు.చాలా మంది హీరోయిన్లు సోషల్ మీడియాలో తరుచుగా ట్రోలింగ్ కి గురవుతూ ఉంటారు.
అయితే హీరోయిన్లు కూడా మనలాంటి సాధారణ మనుషులే అని, వారికి ఫీలింగ్స్ ఉంటాయనే విషయాన్ని కూడా చాలా మంది కామన్ సెన్స్ లేని నెటిజన్లు భావిస్తుంటారు.అందుకే వారిని ట్రోల్ చేసి వీరు ఫేమస్ అవ్వాలని అనుకుంటారు.
మరీ ముఖ్యంగా హీరోయిన్ లావుగా ఉందంటే ఆమెని అదేపనిగా ట్రోల్ చేస్తూ బాడీ షేమింగ్ చేస్తూ పైశాచిక ఆనందంపొందుతారు.గతంలో హాన్సిక అలాంటి అనుభవమే పేస్ చేసింది.
అలాగే నిత్యా మీనన్ కూడా తరుచుగా తన లావుపై కామెంట్స్ ని సోషల్ మీడియాలో పేస్ చేస్తూ ఉంటుంది.ఇక సమీరారెడ్డి కూడా తనపై వచ్చిన ట్రోలింగ్, బాడీ షేమింగ్ పై తాజాగా ఆసక్తికర విషయాలు తెలియజేసింది.
ఒక్కొక్కరి శారీరక తత్త్వం ఒక్కోలా ఉంటుంది.హీరోయిన్లు అయినంత మాత్రాన లావుగా ఉండకూడదా అనే మాట ఈ మధ్య వినిపిస్తుంది.
తాజాగా నటి వనిత అయితే లావుగా ఉన్న తన శరీరం అంటే తనకి ఇష్టం అంటూ ఏకంగా బాడీ పాజిటివిటీపై సందేశం ఇవ్వడానికి న్యూడ్ ఫోజులు ఇచ్చింది.వాటిని తన ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసి నా శరీరాన్ని చూసి నేను గర్వపడుతున్నాను అని రాసుకొచ్చింది.
బాడీ షేమింగ్ కామెంట్స్ చేసేవాళ్లుకి కౌంటర్ ఇవ్వడానికి ప్రతి ఒక్కరు తమ శరీరాన్ని తాము ఇష్టపడాలని చెప్పడానికి వనిత సందేశం ఇచ్చింది.ఈమె బాలీవుడ్ లో అర్జున్ రెడ్డి రీమేక్ కబీర్ సింగ్ లో పనిమనిషి పాత్రలో నటించింది.