సెలెబ్రెటీలు ఎక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేందుకు ప్రయత్నిస్తుంటారు.వారి అభిమానులతో తరచూ ఏదో ఒకటి ట్వీట్ చేస్తూ అభిమానులతో ఎప్పటికప్పుడు రకరకాల విషయాలపై స్పందిస్తూ ఉంటారు.
అయితే తాజాగా బాలీవుడ్ నటి, మాజీ మిస్ ఇండియా ఊర్వశి రౌటేలా తన తల్లి తనకు పంపిన ఓ ఫోటోను తన ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసి అభిమానులతో పంచుకుంది.అయితే నటి ఊర్వశి తల్లి షేర్ చేసిన ఫోటో ఎవరిదో తెలుసా భారత క్రికెట్ కెప్టెన్ విరాట్ కోహ్లీది.
కోహ్లీ తన తల్లికి వంటసాయం చేస్తున్న ఫోటోను నటి ఊర్వశికి పంపింది.
అయితే వారి అమ్మ కోహ్లీ ఫోటో ఎందుకు పంపినదో అర్థం కాక ఊర్వశి తన అభిమానులను సాయం కోరింది.
కోహ్లీ ఫోటో ఎందుకు పంపినదో గెస్ చేయాలంటూ ఊర్వశి చెప్పడంతో నెటిజన్లు తమకు తోచిన సమాధానాలు ఇస్తున్నారు.కొందరు నెటిజన్లు నటి ఊర్వషిని వంట నేర్చుకోమని ఈ ఫోటో ద్వారా సలహా ఇచ్చిందని కొందరు నెటిజన్లు కామెంట్స్ చేస్తుండగా ఇంకొందరు కోహ్లీ వంట చేస్తున్నాడు, కనీసం నీకు వంట రాకపోయినా వంట వచ్చిన భర్తను చూసుకో, కనీసం తల్లికి అప్పడప్పుడూ సహాయం చేయు మని అర్థం వచ్చేలా ఈ ఫోటో పంపి ఉంటుందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.