బాలీవుడ్ బోల్డ్ బ్యూటీ ఊర్వశి రౌతేలా.పలు సినిమాలలో నటించిన ఊర్వశి స్టార్ హీరోయిన్ గా మాత్రం ఎదగలేకపోయింది.
మోడలింగ్ లో మాత్రం ఓ రేంజ్ లో క్రేజ్ సొంతం చేసుకుంది.బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఎదగడానికి ఎన్నో పాట్లు పడుతుందని చెప్పవచ్చు.
తన అందంతో యువతను మాత్రం బాగా రెచ్చగొడుతుంది.ఇక సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా ఉంటుంది.
ఎప్పటికప్పుడు తన హాట్ ఫోటోలతో బాగా పిచ్చెక్కిస్తుంది.అంతేకాకుండా తన డాన్స్ స్టెప్పులతో అందర్నీ ఫిదా చేస్తుంది.అందం విషయంలో బాగా శ్రద్ధ తీసుకుంటుంది ఊర్వశి.ఇక తాజాగా తన ఇన్స్ స్టా గ్రామ్ వేదికగా ఓ ఫోటో షేర్ చేసుకోగా అందులో అర్థనగ్నంగా కనిపిస్తూ షాక్ ఇచ్చింది.
తాజాగా తన శరీరానికి మొత్తం రేగడి బురద పూసుకొని ఉంది.ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట్లో వైరల్ గా మారింది.
ఈ ఫోటో చూసిన నెటి జనులు ఒకే సారి చూసి ఏదో విగ్రహం అని అనుకున్నారని కామెంట్స్ చేస్తున్నారు.
దీని గురించి కొన్ని విషయాలు పంచుకున్న ఊర్వశి రౌతేలా తన అందాన్ని మరింత మెరుగు పరుచుకోవడానికి ఇలా బురద స్నానాని చేస్తున్నానని తెలిపింది.తన శరీరంపై ఉన్న విషపూరిత కణాలు తొలగించుకోవడానికి చాలా కాలం నుండి ఇలా చేస్తున్నానని తెలిపింది.శరీరం మొత్తం రేగడి మట్టితో కవర్ చేయగా అలా కూర్చోబెడతారట.
ఇలా చేయడం వల్ల శరీరానికి, మనసుకు రిలాక్స్ ఉంటుందట.
ఇక ఇదే తన మడ్ బాత్ అని కాప్షన్ కూడా పెట్టింది.
అంతేకాకుండా శరీరం నాజుగ్గా, సున్నితంగా తయారవుతుందని తెలిపింది.హాలీవుడ్ కీయారా నైట్లీ, గ్వేనెత్ పాల్త్రో లాంటి తెరఫీ చేస్తారని తెలిపింది ఊర్వశి.
ఇక ఈ బ్యూటీ టాలీవుడ్ లో ఓ సినిమాలో నటిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.అంతేకాకుండా వరుస సినిమాలలో అవకాశాలు అందుకుందట.